మందుబాబులకు గుడ్ న్యూస్- ఏపీలో 50 నుంచి 1350 వరకూ తగ్గిన బాటిల్ ధరలు
ఏపీలో గతేడాది అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మందుబాబులకు చుక్కలు చూపిస్తున్న వైసీపీ సర్కారు తొలిసారిగా వారిపై కనికరం చూపింది. రాష్ట్రంలో వివిధ బ్రాండ్ల, బాటిళ్ల మద్యం ధరలను తగ్గిస్తూ ఎక్సైజ్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం కనీసం 50 రూపాయల నుంచి గరిష్టంగా 1350 రూపాయల వరకూ ధరలు తగ్గబోతున్నాయి. తగ్గించిన ధరలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి.
ఏపీలో మద్యం ధరలను తగ్గిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మద్యం షాపులను తన ఆధీనంలోకి తెచ్చుకోవడంతో పాటు అపరిచిత బ్రాండ్లను తీసుకొచ్చిన ప్రభుత్వం.. మద్యం షాపులను కూడా భారీగా తగ్గించింది. అదే సమయంలో భారీగా మద్యం ధరలు పెంచుకుంటూ పోయింది. మద్యం విక్రయాలను నిరుత్సాహపరిచే పేరుతో ధరలను భారీగా పెంచడంపై మందుబాబులు గగ్గోలు పెడుతున్నారు. దీంతో ప్రభుత్వం ఈసారి వారికి ఊరటనిచ్చేలా ధరలను తగ్గించింది.

50 ఎంఎల్ నుంచి మొదలుపెట్టి 60 ఎంఎల్, 90 ఎంఎల్, 180ఎంఎల్, 200 ఎంఎల్, 700 ఎంఎల్, 750 ఎంఎల్, 1000 ఎంఎల్ అంతకు పైబడిన బ్రాండ్లు, బాటిళ్ల ధరలు రూ.200 కంటే తక్కువ ఉంటే అందులో ఎలాంటి మార్పు లేదు. రూ.200 రూపాయలు దాటిన వాటికి మాత్రం రూ.50 రూపాయల నుంచి తగ్గింపు చేపట్టారు. గరిష్టంగా 1000 ఎంఎల్, అంతకు పైబడిన బాటిళ్లకు వెయ్యి రూపాయలకు పైగా ధర ఉంటే అందులో 1350 వరకూ తగ్గబోతోంది. దీంతో మందుబాబులకు భారీగా ఊరట దక్కినట్లవుతుంది.
-
ఏపీలో పర్యాటకానికి మహర్దశ.. కీలక ఆదేశాలిచ్చిన సీఎం చంద్రబాబు -
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!











Click it and Unblock the Notifications