ఏపీలో జర్నలిస్టులకు సర్కారు తీపి కబురు...
ఆంధ్ర ప్రదేశ్ లోని జర్నలిస్టులకు ప్రభుత్వం తీపికబురు ప్రకటించింది. అక్రిడేషన్ కార్డుల గడువును మరో మూడు నెలల పాటు పొడిగిస్తున్నట్లు రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్ల తెలిపారు. ఈ మేరకు ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పత్రికా రంగానికి ప్రాధాన్యత ఇస్తూ, మీడియా ప్రతినిధులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించేందుకు కట్టుబడి ఉందని హిమాన్షు శుక్ల తెలిపారు.
ప్రస్తుతం రాష్ట్రంలోని జర్నలిస్టులకు ఉన్న అక్రిడేషన్ కార్డుల గడువు ముగియనుండటంతో.. వాటి గడువును జూన్ 1, 2025 నుంచి ఆగస్టు 31, 2025 వరకు.. లేదా కొత్త అక్రిడేషన్ కార్డులు జారీ చేసే ప్రక్రియ ప్రారంభం అయ్యే వరకు - ఏది ముందుగా జరిగితే అప్పటి వరకు పొడిగిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ మేరకు సంబంధిత ఉత్తర్వులు కూడా జారీ చేసినట్లు పేర్కొన్నారు.

మీడియా హక్కులను రక్షిస్తూ, వారికి మద్దతుగా ఉండటమే ఈ నిర్ణయానికి కారణమని వెల్లడించారు. ఇక కొత్త అక్రిడేషన్ ప్రక్రియ త్వరలో ప్రారంభించనుండగా.. సంబంధిత మార్గదర్శకాలను త్వరలో విడుదల చేయనున్నట్లు సమాచారం. కొత్త కార్డుల జారీకి సంబంధించిన ప్రక్రియలో అప్డేట్స్ కోసం అధికారిక వెబ్సైట్ను పరిశీలిస్తూ ఉండాలని సూచించారు.
-
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!!












Click it and Unblock the Notifications