AP Registrations : ఏపీ రిజిస్ట్రేషన్లలో తాజా మార్పులివే-సర్కార్ ప్రకటన..
ఏపీలో ప్రజలకు మరింత వేగంగా, పారదర్శకంగా, నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వ్యవస్థకు ఆధునిక సాంకేతికతను జోడించి విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఆధునిక సాంకేతికతతో కార్డ్ ప్రైం సాఫ్ట్ వేర్, ఈ-స్టాంపింగ్, గ్రామ/వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలతో ప్రజలకు మరింత సులభతరం చేసింది. పైలట్ ప్రాజెక్టుగా ఇప్పటికే 23 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో సేవలు అందుబాటులో ఉండగా త్వరలో రాష్ట్రవ్యాప్తంగా వీటిని విస్తరించనున్నారు.
రిజిస్ట్రేషన్ దస్తావేజులు ఇకపై ఆన్లైన్ ద్వారా సమర్పించే వెసులుబాటు కల్పించనున్నారు. కార్డ్ ప్రైం అప్లికేషన్ ద్వారా వినియోగదారులు తమ దస్తావేజులు తామే స్వయంగా రూపొందించుకోవడంతో పాటు రిజిస్ట్రేషన్ ఛార్జీలు సైతం సొంతంగా కాలిక్యులేట్ చేసుకుని ఆన్ లైన్ ద్వారా చెల్లించే సదుపాయం కూడా కల్పిస్తున్నారు. అనుకూలమైన సమయాల్లో రిజిస్ట్రేషన్ టైం స్లాట్ బుక్ చేసుకునే సౌలభ్యం ఉంటుంది. వెంటనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తవుతుంది. ఈ-సైన్ సౌకర్యంతో డాక్యుమెంట్స్ కు మరింత భద్రత ఉంటుంది.

ఎటువంటి అవినీతికి తావులేకుండా పూర్తి పారదర్శకతతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపడుతున్నారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ పూర్తయిన వెంటనే రెవెన్యూ రికార్డుల్లో పేరు మార్పు చేస్తున్నారు. ఆధునిక సాంకేతికత వినియోగం ద్వారా ఫోర్జరీ, నకిలీ డాక్యుమెంట్ల నిర్మూలన కూడా సాధ్యం కానుంది. స్టాంప్ డ్యూటీ, ఇతర ఛార్జీలు ఆన్ లైన్ ద్వారా చెల్లించే వెసులుబాటు కల్పిస్తున్నారు. స్టాంపులు కృత్రిమ కొరత, నకిలీలు, పాత తేదీల స్టాంపులకు చెల్లు చీటీ పాడతారు. స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ (SHCL) బ్రాంచ్ లు, స్టాంపు వెండార్లు, కామన్ సర్వీస్ సెంటర్లలో (CSC) ఈ స్టాంపింగ్ సేవలు లభిస్తాయి.రాష్ట్రవ్యాప్తంగా 2500 సెంటర్ల ద్వారా ఈ- స్టాంపుల విక్రయం చేపట్టారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రామ/వార్డు సచివాలయాల్లో సైతం పూర్తి స్థాయిలో రిజిస్ట్రేషన్ సేవలు కల్పిస్తున్నారు. తొలి విడతగా 1680 గ్రామ/వార్డు సచివాలయాలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుగా అప్ గ్రేడ్ చేశారు. త్వరలో మిగిలిన గ్రామ/వార్డు సచివాలయాల్లో కూడా సేవల్ని విస్తరిస్తారు. తద్వారా ప్రజల చెంతకే అన్ని రిజిస్ట్రేషన్ సౌకర్యాలు వస్తాయి. ముఖ్యంగా స్టాంప్ విక్రయ సేవలు, ఇ.సి (ఎన్ కంబరెన్స్ సర్టిఫికెట్), సి.సి, హిందూ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ మరియు మార్కెట్ వాల్యూ అంచనా వంటి అన్ని సేవలు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి.
రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్ ద్వారా జనరేట్ అయ్యే రిజిస్ట్రేషన్ దస్తావేజుకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ - 2000 మేరకు పూర్తి స్థాయి చట్ట భద్రత ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. అందుబాటులోకి రానున్న డిజిటల్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్, ఫిజికల్ డాక్యుమెంట్ తో సమానంగా డిజిటల్ రిజిస్టర్ డాక్యుమెంట్ కు గుర్తింపు ఇస్తున్నారు. ఈ-సైన్ ద్వారా మరింత భద్రత ఉంటుంది. ఆన్లైన్లోనే డాక్యుమెంట్ ఒరిజినాలిటీ వెరిఫై చేసే అవకాశం ఇస్తున్నారు.
దీంతో ఆన్లైన్ వెరిఫికేషన్తో నకిలీ డాక్యుమెంట్లకు చెక్ పెట్టినట్లే. బ్యాంకులు ఇతర సంస్థలు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను ఆన్లైన్లో వెరిఫై చేసుకునే సదుపాయం కూడా కల్పిస్తున్నారు. నూతన విధానంలో అత్యంత సెక్యూరిటీ ప్రమాణాలతో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ రూపొందించబడుతుంది. నూతన విధానంలో సాక్షులు లేకుండా రిజిస్ట్రేషన్లు అనేది పూర్తి 'అవాస్తవం' అని ప్రభుత్వం తెలిపింది. ఈ ఆధార్ ద్వారా సాక్షుల సంతకాల సేకరణ 'వాస్తవం' అని వెల్లడించింది.
నూతన రిజిస్ట్రేషన్ విధానంలో ఫిజికల్ డాక్యుమెంట్ ఇవ్వరనేది పూర్తి అవాస్తవమని తెలిపింది. ఫిజికల్ డాక్యుమెంట్ కావాలన్నవారికి ఈ స్టాంప్ పై డిజిటల్ సిగ్నేచర్ ప్రింట్ చేసి ఇస్తారు. "స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల" కు సూచనలు, ఫిర్యాదుల కొరకు జగనన్నకు చెబుదాం 1902 టోల్ ఫ్రీ నంబర్ కూడా అందుబాటులో ఉంచారు.
-
జగన్ సన్నిహిత అధికారితో రహస్య భేటీ, ప్రభుత్వం సీరియస్- ఐఏఎస్ పై వేటు..!! -
ఏపీలో గ్యాస్ కొరతపై మంత్రి నాదెండ్ల మనోహర్ క్లారిటీ -
ఏపీలో ఆ ప్రాంతానికి పులి, స్థానికుల భయం.. రంగంలోకి హనుమాన్ బృందాలు! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్












Click it and Unblock the Notifications