సచివాలయ ఉద్యోగులకు మరో షాక్..! తాజా ఆదేశాలు..!
ఏపీలో వైసీపీ హయాంలో అమల్లోకి వచ్చిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్ధలో కూటమి సర్కార్ తాజాగా భారీ మార్పులు చేస్తోంది. ప్రజలకు పథకాలతో పాటు అన్ని సేవల్ని అందించేందుకు వీలుగా వీటిలో ప్రక్షాళన చేస్తోంది. ఉద్యోగుల బదిలీలు, సచివాలయ వర్గీకరణతో పాటు పలు నిర్ణయాలు తీసుకుంటోంది. ఇదే క్రమంలో ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇంత చేసిన తర్వాత కూడా సచివాలయాలపై ప్రజాభిప్రాయం ఎలా ఉందనేది తెలుసుకోవాలని భావిస్తోంది.
ఇందుకోసం రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాల సేవలపై ఐవీఆర్ కాల్స్ ద్వారా ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పథకాలు, ధృవపత్రాలు, ఇతర దరఖాస్తుల స్వీకరణ, సిబ్బంది అందుబాటు వంటి పలు అంశాలపై ఈ ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై వచ్చే ప్రజాభిప్రాయం ఆధారంగా సచివాలయాల్లో మార్పులు చేర్పులపై నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా లేకపోలేదు.

ఈ నేపథ్యంలో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగుల్ని అందుబాటులో ఉంచాలని డీడీవోలు, ఎంపీడీవోలు, ఎంసీలు, ఎంజీవోలు, యూజీవోలకు ఆదేశాలు వెళ్తున్నాయి. ప్రభుత్వం ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది అందుబాటులో ఉంటున్నారో లేదో తెలుసుకోవాలనుకుంటోందని ఆయా ఆధికారులకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు పంపుతున్నారు. ప్రభుత్వం ప్రజాభిప్రాయం తీసుకుంటున్నందున సిబ్బందిని పూర్తి స్దాయిలో సచివాలయాల్లో అందుబాటులో ఉంచాలని, మూమెంట్ రిజిస్టర్ నిర్వహించాలని, ప్రజలతో మర్యాదగా, సున్నితంగా మాట్లాడాలని జిల్లా గ్రామ, వార్డు సచివాలయ అధికారులు ఆదేశాలు ఇస్తున్నారు.

అయితే ప్రభుత్వ ఆదేశాలపై సచివాలయ ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సచివాలయాల్లో పలు మార్పులు చేస్తూ.. హాజరుపై నిఘా పెట్టడం, ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా తమపై సర్వేలు చేయించడంపై వారు మండిపడుతున్నారు. రాష్ట్రంలోని ఏ శాఖ ఉద్యోగులపైనా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం లేదని వారు చెప్తున్నారు. తమ డిమాండ్ల పరిష్కారం విషయంలో వేగంగా నిర్ణయాలు తీసుకోవడం లేదని, అదే సమయంలో తమను ఒత్తిడిలోకి నెడుతున్నారని ఆరోపిస్తున్నారు.
-
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
ఆ లాజిక్ ఏంటో ? చంద్రబాబును ఇరుకునపెట్టేసిన సాయిరెడ్డి..! -
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం-ఎల్పీజీ సిలెండర్ల స్ధానంలో ఇక..! -
గ్యాస్ కు ప్రత్యామ్నాయంగా నేటినుండి కిరోసిన్ పంపిణీ మొదలెట్టిన ఏపీ ప్రభుత్వం! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
హైదరాబాద్ ను మించి అమరావతి నిర్మాణం చేస్తామన్న సీఎం చంద్రబాబు! -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications