ఏడేళ్ల నాటి కేసులో బాలకృష్ణపై విచారణ నిలిపివేత: జీవో జారీ చేసిన బాబు ప్రభుత్వం
అమరావతి: సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై ఏడేళ్ల క్రితం (2009)లో నరసరావుపేటలో నమోదైన కేసులో విచారణను నిలిపివేస్తూ ప్రభుత్వం బుధవారం జీవో జారీ చేసింది. 2009లో జరిగిన స్వార్వత్రిక ఎన్నికల్లో నరసరావుపేట అసెంబ్లీ అభ్యర్థిగా పోటీలో ఉన్న కోడెల శివప్రసాదరావుకు మద్దతుగా ప్రచారం చేసేందుకు బాలకృష్ణ వచ్చారు.

ఆ సమయంలో నరసరావుపేట పట్టణంలో పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. అయినప్పటికీ నిబంధనలను అతిక్రమించి ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించినందుకు గాను బాలకృష్ణతోపాటు కోడెల, ఆయన కుమారుడు శివరామకృష్ణ, మోదుగుల వేణుగోపాల్ తదితర 15 మందిపై కేసు నమోదైంది.
తాజాగా ఇప్పుడు ఈ కేసులో వీరిపై ప్రాసిక్యూషన్ను విత్డ్రా చేసుకోవాలని రాష్ట్ర డీజీపీ సాంబశివరావు ఆదేశాల మేరకు ప్రిన్సిపల్ సెక్రటరీ ఎ.ఆర్.అనూరాధ జీవో నంబరు 122ను జారీచేశారు.












Click it and Unblock the Notifications