పీఎస్సార్, కాంతిరాణా టాటాపై ప్రభుత్వం అనూహ్య నిర్ణయం- ఉత్తర్వులు..!!
సీనియర్ ఐపీఎస్ అధికారుల పైన ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. వైసీపీ హయాంలో కీలక అధికారులుగా పని చేసిన వీరి పైన కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టగానే చర్యలు తీసుకుంది ముంబైకి చెందిన సినీనటి కాదంబరి జెత్వానీపై అక్రమ కేసు బనాయించి ఆమెతో టు కుటుంబ సభ్యులను వేధించిన కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారుల పై ఇప్పటికే సస్పెన్షన్ వేటు వేసింది. కాగా.. ఇప్పుడు ఇదే వ్యవహారంలో ఇద్దరు ఐపీఎస్ అధికారుల పైన కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులు నిఘా చీఫ్ గా పని చేసారు. కాంతి రాణా టాటా విజయవాడ సీపీగా వ్యవహరించారు. వైసీపీ ప్రభుత్వంలోని ముఖ్యుల ఆదేశాలకు అనుగుణంగా వీరు వ్యవహరించారని కూటమి నేతలు ఆరోపించారు. దీంతో, కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ముంబైకి చెందిన సినీనటి కాదంబరి జెత్వానీపై అక్రమ కేసు బనాయించి ఆమెతోపాటు కుటుంబ సభ్యులను వేధించిన కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారు ల పైన సస్పెన్షన్ వేటు వేసింది. అదే విధంగా పీఎస్సార్ ఆంజనేయులు జైలుకు వెళ్లారు. అణా రోగ్య కారణాలతో ఆయనకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం ఆయన బెయిల్ పైన ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే జెత్వానీ నుంచి స్టేట్మెంట్ రికార్డు చేసారు. కాగా.. వీరి సస్పెన్షన్ పైన గతంలో సమావేశమైన రివ్యూ కమిటీ కేసు దర్యాప్తుపై ఆరా తీసింది. ఇంకా విచారణ పూర్తి కాక పోవటంతో సస్పెన్షన్ ఎత్తేస్తే సీనియర్ ఐపీఎస్ అధికారులు దర్యాప్తుపై ప్రభావం చూపించే అవకాశం ఉందని కమిటీ అభిప్రాయపడింది.

కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత చర్యలు
దీంతో, 2025 మార్చి 8 వరకూ సస్పెన్షన్ పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే కేసులో సస్పెండైన మరో ఐపీఎస్ అధికారి విశాల్ గున్నీ తనకు పోస్టింగ్ ఇప్పించాలంటూ కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ను ఆశ్రయించారు. ఇక.. గతంలో రివ్యూ కమిటీ చేసిన సిఫార్సుల మేరకు సస్పెండ్ చేసిన ప్రభుత్వం.. ప్రస్తుతం ఆ కాల పరిమితి ముగుస్తుండటంతో మరో సారి వీరి సస్పెన్షన్ ను ఆరు నెలలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయం నుంచి వీరు సస్పెన్షన్ లోనే ఉన్నారు. అటు విశాల్ గున్నీ ట్రిబ్యునల్ ను ఆశ్ర యించటంతో.. అక్కడ నుంచి ఎలాంటి నిర్ణయం వస్తుందనేది కీలకంగా మారుతోంది. కాగా.. ఈ అధికారులు నాడు వైసీపీ ముఖ్య నేతలకు అనుకూలంగా పని చేసారనేది కూటమి నేతల ఆరోపణ. దీంతో.. రానున్న రోజుల్లో వీరి విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.
-
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నిమ్మల రామానాయుడు.. వారికి 6వేల జీతం పెంపు! -
ఏపీలో వాహనదారులకు భారీ షాక్-అసెంబ్లీలో బిల్లు..! -
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ !! -
ఏపీ పారిశ్రామిక చరిత్రలో మైలురాయి.. అతి భారీ స్టీల్ ప్లాంట్ కు ముహూర్తం ఫిక్స్! -
ఇద్దరు, ఆపైన పిల్లలను కంటే రూ.25 వేలు, ఇంకా బోలెడు బెనిఫిట్స్: సీఎం చంద్రబాబు! -
కూటమి ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు - ముహూర్తం ఫిక్స్..!! -
ఏపీ ప్రజలకు ఉగాది కానుక.. వారికి ఏకంగా లక్ష ఇళ్ళు! -
మద్యం కొనాలంటే.. ఇక ఇలా తప్పనిసరి- తాజా మార్గదర్శకాలు..!! -
ఏపీ మద్యం స్కాంలో కీలక పరిణామాలు-ఈడీ తాజా షాక్..! -
'తల్లికి వందనం’ నిధుల జమ పై ప్రభుత్వం కీలక ప్రకటన, ఇక వారికీ..!! -
ఆశలు ఆవిరి చేస్తోన్న బంగారం ధరలు -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, మూడు రోజుల్లో పూర్తి..!! -
అనసూయకు అవమానం..? వీడియో -
డిగ్రీలెందుకు దండగ.. గాడిదలు ఉంటే పండగ! -
షాకింగ్ న్యూస్: పదో తరగతి పరీక్షలు రద్దు













Click it and Unblock the Notifications