ఏపీలో ఇళ్ల స్ధలం కోసం దరఖాస్తు చేసుకోలేదా ? మరో అవకాశం ఇదిగో....15 రోజులే గడువు..
ఏపీలో నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకం కింద స్ధలాలకు దరఖాస్తు చేసుకునేందుకు పేదలకు ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది. గతంలో దరఖాస్తు చేసుకోలేకపోయినవ వారు ఎవరైనా ఉంటే మరో 15 రోజుల్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని సీఎం జగన్ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. ఇవాళ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో జగన్ ఈ మేరకు ఇళ్ల స్ధలాల పంపిణీపై తాజా సూచనలు చేశారు

ఇళ్ల స్ధలాల కోసం దరఖాస్తులు తీసుకున్నాక పరిశీలన అనంతరం అర్హుల జాబితాలను గామ సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితాలు పెట్టాలని ఆదేశించారు. మే 6 నుంచి 21 వరకూ జాబితాలు ప్రదర్శించాలని, ఆ తర్వాత మరో 15 రోజుల పాటు పరిశీలించి జూలై 7 లోగా తుది జాబితాలను ఖరారు చేయాలని జగన్ సూచించారు. ఈ దరఖాస్తులకు సంబంధించి ఏమైనా కొత్తగా భూములు కొనుగోలు చేయాల్సి వస్తే, చేయాలన్నారు.పక్షపాతం లేకుండా ఈ ప్రక్రియ సాగాలన్నారు.












Click it and Unblock the Notifications