వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏప్రిల్ 15 నుంచి ఏపీలో రెండోసారి ఉచిత రేషన్ - రెడ్ జోన్లలో ఇంటి వద్దకే సరుకులు..

|
Google Oneindia TeluguNews

ఏపీలో రెండో విడత ఉచిత రేషన్ పంపిణీ కార్యక్రమం ఏప్రిల్ 15 నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే ఓసారి రేషన్ సరుకులను ఉచితంగా పంపిణీ చేసిన ప్రభుత్వం ఈసారి వాలంటీర్ల సాయంతో ఇళ్ల వద్దకే కూపన్లు పంపడంతో పాటు దుకాణాల వద్ద ప్రత్యేక ప్రణాళిక అమలు చేయబోతోంది. రెడ్ జోన్లలో మాత్రం ఇంటి వద్దకే సరుకులు రానున్నాయి.

ఏపీలో మరోసారి ఉచిత రేషన్..
ఏపీలో ఈ నెలలో రెండోసారి ఉచిత రేషన్ సరుకుల పంపిణీ ఏప్రిల్ 15 నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ నెలకు సంబంధించిన రేషన్ సరుకులను మార్చి చివరి వారంలోనే పంపిణీ ప్రారంభించిన ప్రభుత్వం.. 15 నుంచి రెండో విడత ఉచిత రేషన్ పంపిణీకి ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకు సంబంధించిన కూపన్లు కూడా విడుదల చేసింది.

ap govt to distribute second time free ration to poor from april 15th

రెడ్ జోన్లలో మాత్రం ఇంటివద్దకే..
ఉచిత స‌రుకుల పంపిణీకి ఇప్పటికే కూప‌న్లు రావడంతో వాటిని గ్రామ, వార్డు వాలంటీర్లు లబ్ది దారుల ఇళ్ల వద్దకే పంపాలని నిర్ణయించింది. వీటిని తీసుకుని ఈ నెల 15 నుంచి రెండోసారి ఉచితంగా రేష‌న్ స‌రుకుల పంపిణీ కోసం ల‌బ్ధిదారులు వచ్చేందుకు వీలు కల్పిస్తారు. లబ్ది దారులను ఈసారి కూడా వేలి ముద్రల నుంచి మినహాయింపు ఇచ్చారు. అలాగే రేషన్ షాపుల వద్ద రద్దీని నియంత్రించేందుకు ప్ర‌ణాళిక‌ రూపొందించారు. వీటి ప్రకారం రద్దీని నివారిస్తారు. అలాగే రెడ్ జోన్లుగా ప్ర‌క‌టించిన ప్రాంతాల్లో ఇంటింటికీ రేష‌న్ అందించేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.

Recommended Video

Vizag Municipal Commissioner Srujana Attending Duties With One Month Baby

English summary
andhra pradesh government to distribute free ration to bpl families from april 15th. govt to distribute ration second time in the month. govt sending coopans with village and ward volunteers to the beneficiaries only.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X