టిడ్కో ఇళ్లపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం-వారికి డబ్బులు రిఫండ్..!
ఏపీలో టిడ్కో ఇళ్లపై (TIDCO Houses) కూటమి సర్కార్ (ap govt) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న టిడ్కో ఇళ్లను పూర్తి చేసి ఉగాదికి లబ్దిదారులకు అందించాలని నిర్ణయించిన సర్కార్.. అదే సమయంలో గత ప్రభుత్వంలో డబ్బులు చెల్లించి దరఖాస్తు చేసిన వారికి ఇళ్లు రాకపోతే ఏం చేయాలన్న దానిపై ఓ నిర్ణయానికి వచ్చింది. వారికి అప్పట్లో చెల్లించిన డబ్బులు వెనక్కి ఇచ్చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. త్వరలోనే ఈ డబ్బుల రిఫండ్ చేపట్టనున్నారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టిడ్కో ఇళ్ల కోసం భారీ సంఖ్యలో లబ్దిదారులు డబ్బులు చెల్లించారు. అయినా వారికి ఫ్లాట్ కేటాయింపులు జరగలేదు. ఇలాంటి వారికి అప్పట్లో వాళ్లు చెల్లించిన దరఖాస్తు సొమ్ము తిరిగి ఇచ్చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో మొత్తం ఇలాంటి 83,865 మంది దరఖాస్తుదారులకు రూ.174 కోట్లు వెనక్కి ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు. అలాగే రాష్ట్రంలో నిర్మాణం పూర్తైన 1,00,875 టిడ్కో ఇళ్లను త్వరలోనే లబ్దిదారులకు అందించి, గృహప్రవేశాలు చేసేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

మరోవైపు రాష్ట్రంలోని 123 పట్టణ స్ధానిక సంస్థల్లో ప్రతీ ఇంటికి క్యూఆర్ కోడ్తో డిజిటల్ డోర్ నెంబర్లు త్వరగా కేటాయించాలని సీఎం ఆదేశించారు. ఆస్తి పన్ను నుంచి మొదలుకుని అన్ని వివరాలు క్యూఆర్ కోడ్తో లింక్ చేయాలన్నారు. భారత్ బిల్, మన మిత్రతో వాటిని అనుసంధానించాలన్నారు. అలాగే ఎక్కడా తాగునీరు కలుషితం కాకుండా నీటి నాణ్యత పర్యవేక్షణ ఎప్పటికప్పుడు జరగాలని, దీనికి స్మార్ట్ వాటర్ పైపులైన్ గ్రిడ్ ఏర్పాటు చేయాలని చెప్పారు. పట్టణ స్థానిక సంస్థల్లో మౌలిక వసతులు, ఇతర మరమ్మతులకు 100 రోజుల ప్రణాళిక అమలు చేయాలన్నారు.
-
ఏపీ సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ భేటీ..! -
ఎల్పీజీ స్ధానంలో PNG కనెక్షన్ తీసుకుంటే - ఏపీ సర్కార్ భారీ సబ్సిడీ ఆఫర్ ..! -
ఏపీలో పర్యాటకానికి మహర్దశ.. కీలక ఆదేశాలిచ్చిన సీఎం చంద్రబాబు -
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!!














Click it and Unblock the Notifications