కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం: జగన్ ఎలక్షన్ టీం ఇదే..!!
అమరావతి: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణలో మరో కీలక ఘట్టం ముగిసింది. నూతన మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్న ఎమ్మెల్యేల జాబితాకు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆదివారం సాయంత్రం ఆమోదం తెలిపారు. కాగా, 11 మంది పాత మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మొత్తం 25 మందితో నూతన మంత్రివర్గం కొలువుదీరనుంది
సోమవారం ఉదయం 11.31 గంటలకు వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం పక్కనే ఉన్న పార్కింగ్ స్థలంలో మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమ ఏర్పాట్లు చేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచన మేరకు నూతన మంత్రులకు గవర్నర్ శాఖలు కేటాయించనున్నారు. మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్న ఎమ్మెల్యేలకు ఇప్పటికే సీఎంవో నుంచి ఆహ్వానాలు అందడంతో వారంతా విజయవాడ చేరుకున్నారు. ఇక కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారంకు సంబంధించి మినిట్ టూ మినిట్ లైవ్ మీకోసం

READ MORE












Click it and Unblock the Notifications