60వేలకు చేరిన ఏపీ రైతు రుణమాఫీ ఫిర్యాదులు
అమరావతి: రైతు రుణమాఫీపై ఇప్పటివరకు 60వేల ఫిర్యాదులు అందినట్లు ఏపీ ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు సి. కుటుంబరావు చెప్పారు. ఈ నెలాఖరు నుంచి వీటి నమోదు ప్రక్రియ మొదలుపెట్టి, మేలోగా పూర్తి చేస్తామని చెప్పారు. సోమవారం ఏపీ సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
రాజధాని ప్రతిపాదిత ప్రాంతంలో రైతుల రుణమాఫీ ప్రక్రియ వేగంగా జరుగుతోందని చెప్పారు. ఆ ప్రాంత పరిధిలో మొత్తం 22 వేల ఖాతాల నమోదు ప్రక్రియను బ్యాంకులు పూర్తి చేయాల్సి ఉందని చెప్పారు. ఒక్కో ఖాతా నమోదుకు పది నిమిషాల పడుతుందని అన్నారు.

బుధవారం సాయంత్రానికి అన్ని అయిపోతాయని, ఆ తర్వాత వాటిని పరిశీలించేందుకు ఒక రోజు పడుతుందని చెప్పారు. గతంలో చెప్పినట్లు రాజధాని ప్రాంత రైతుల బ్యాంకు ఖాతాల్లో ఈనెల 25లోగా ఒక్కొక్కరికి గరిష్టంగా రూ. లక్షన్నర వరకు నగదు జమ చేసేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు.
ఇక జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో రైతుల రుణమాఫీ ఫిర్యాదు కేంద్రాలు ఏర్పాటు చేసే అంశంపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ఫిర్యాదుల సంఖ్యను బట్టి నిర్ణయం తీసుకుంటామని, ప్రస్తుతానికి రాష్ట్రస్ధాయి కేంద్రంలోనే వాటిని స్వీకరించనున్నట్లు తెలిపారు.
-
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు












Click it and Unblock the Notifications