రోజూ రాత్రి జగన్-కేసీఆర్ అదే పని -షర్మిల కూడా చెప్పింది -హైదరాబాద్ రెవెన్యూ వదిలేశాం: ఏపీ బీజేపీ
కృష్ణా జలాల వినియోగంపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య వివాదం తారా స్థాయికి చేరడం, రెండు రాష్ట్రాల సీఎంల పరస్పర విరుద్ద ప్రకటనల నేపపథ్యంలో కేంద్ర జల శక్తి శాఖ సైతం మీటింగ్ను వాయిదా వేయడం, ఇది జగన్-కేసీఆర్ కలిసి ఆడుతోన్న డ్రామా అని విపక్షాలు దుమ్మెత్తిపోయడం, జనసేనాని పవన్ కల్యాణ్ సైతం 'జల జగడం నమ్మనశక్యంగా లేద'ని వ్యాఖ్యానించడం లాంటి పరిణామాలు పరిస్థితిని ఇంకాస్త వేడెక్కించాయి. కాగా, తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదంపై తెలంగాణ బీజేపీ కనబరుస్తోన్న దూకుడుకు భిన్నంగా ఏపీ బీజేపీ మెతక వైఖరిని అవలంభిస్తోందనే విమర్శలున్నాయి. వాటికి సమాధానంగా ఏపీ బీజేపీ ఇవాళ ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది. ఈ క్రమంలోనే ఏపీ బీజేపీ నేతలు ఇరు రాష్ట్రాల సీఎంలపై సంచలన వ్యాఖ్యలు చేశారు..

కర్నూలులో కీలక సమావేశం
రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును సాకుగా చూపుతూ తెలంగాణ గొడవ లేవనెత్తడం, కృష్ణా జలాల వివాదం మళ్లీ తెరపైకి వచ్చినప్పటి నుంచి అరకొరగా స్పందిస్తూ వస్తోన్న ఏపీ బీజేపీ ఇక జూలు విదల్చనుంది. 'రాయలసీమ నీటి ప్రాజెక్టులు, అభివృద్ది' పేరుతో శుక్రవారం కర్నూలులో కీలక సమావేశం ఏర్పాటు చేసిన ఏపీ బీజేపీ.. జల వివాదంపై స్పష్టమైన వైఖరితో ఒక ఉద్యమాన్ని రూపొందించి ప్రజల ముందుకు వస్తున్నట్లు ప్రకటించింది. రాయల సమీకు చెందిన కీలక నేతలతోపాటు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా..

హుజూరాబాద్ కోసమే జల వివాదం
10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో ఉండే అవకాశం ఉన్నా, బయటికి వచ్చేశామని, హైదరాబాద్ నుంచి వచ్చే రెవెన్యూను ఏపీ వదులుకుందని, ఇప్పుడు కృష్ణా జలాల్లోనూ ఏపీకి, ప్రత్యేకించి రాయలసీమకు అన్యాయం జరుగుతుతోందని బీజేపీ నేతలు అభిప్రాయపడ్డారు. శ్రీశైలం నుంచి కేసీఆర్ అక్రమంగా నీటిని తరలించుకుపోతుంటే జగన్ స్పందించలేదని మండిపడ్డారు. తెలంగాణలో బీజేపీ దెబ్బకు కేసీఆర్ కూసాలు కదిలిపోయాయని, హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసమే మరోసారి తెలంగాణ వాదాన్ని కేసీఆర్ తెరపైకి తెచ్చి, సీమకు అన్యాయం చేస్తున్నాడని, తన మిత్రుడైన ఏపీ సీఎం జగన్ తో కలిసి డ్రామాలాడుతున్నాడని కమలనాథులు విమర్శించారు.
Recommended Video

రోజూ రాత్రి జగన్, కేసీఆర్ ఇలా..
''రాష్ట్ర వ్యాప్తంగా వివాదాలు లేని ప్రాజెక్టుల నిర్మాణాలను గాలికొదిలేసిన జగన్.. పోలవరానికి మాత్రం అంచనాలు పెంచేస్తూ దోపిడీకి పాల్పడుతున్నాడు. మరోపక్క కేసీఆర్ తో కలిసి తమ వ్యక్తిగత స్వార్థం కోసం ప్రతిరోజూ రాత్రి పూట ఫోన్లలో మాట్లాడుకుంటూ, పగటి పూట మాత్రం ఏమి తెలియనట్టు కేంద్రానికి లేఖలు రాస్తూ నాటకాలాడుతున్నారు. నీటి సమస్యలు పరిష్కరించుకోవటానికి ఆయా బోర్డులు ఉన్నప్పటికీ కొత్తగా వివాదాలను సృష్టించి, ప్రజలను మభ్యపెట్టి ప్రధానమంత్రికి జలశక్తి మంత్రికి లేఖలు రాస్తూ, డ్రామాలు చేస్తూ, మోసం చేస్తున్న వైనాన్ని జగన్ సోదరి వైఎస్ షర్మిల కూడా ఎండగట్టారు. ఇద్దరు సీఎంలు కలిసి ఏపీకి చేస్తోన్న ద్రోహాన్ని ప్రజలకు తెలియజేసేలా ఏపీ బీజేపీ ఒక స్పష్టమైన వైఖరితో ఒక ఉద్యమాన్ని రూపొందించి ప్రజల ముందుకు వస్తుంది'' అని సోము వీర్రాజు తెలిపారు. 2015లో జల ఒప్పందాలపై సంతకాలు చేసిన ఏపీ, తెలంగాణలు ఇవాళ మాత్రం వాటిని ఒప్పుకోబోమనడం భావ్యం కాదని, తెలంగాణను ఏపీ సర్కారు నిలువరించడంలేదని బీజేపీ ఎంపీ టీజీ వెంకటేశ్ అన్నారు.
-
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
ఓపెనర్ గా అభిషేక్ స్థానంలో - ఫైనల్ లో భారీ ట్విస్ట్, ఫలించేనా..!! -
India Post GDS Result 2026: పోస్టాఫీస్ జాబ్స్ మెరిట్ లిస్ట్ విడుదల-ఇలా చెక్ చేసుకోండి..! -
ఫైనల్ మ్యాచ్ వర్షం లో కొట్టుకుపోతే, ఛాంపియన్ ఎవరు - ఐసీసీ తాజా రూల్స్..!! -
కోనసీమ వాసుల కల నెరవేర్చే కొత్త రైల్వే లైన్ ప్రాజెక్ట్ లో కీలక అడుగు -
LPG price hike: గ్యాస్ ధరల షాక్-నేటి నుంచి ఒక్కో సిలిండర్ పై పెంపు ఇలా..! -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!!












Click it and Unblock the Notifications