ఏపీకి మరో బంపర్ ప్రాజెక్టు - కడపలో ఆపిల్ తయారీ యూనిట్ - మంత్రి గౌతమ్ రెడ్డి వెల్లడి
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్(ఈవోడీబీ) లేదా సరళీకృత వాణిజ్యంలో దేశంలోనే టాప్ ర్యాంకులో నిలిచిన ఆంధ్రప్రదేశ్ కు మరో బంపర్ ప్రాజెక్టు రానుంది. ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ సంస్థ ఆపిల్ తన తయారీ యూనిట్ ను ఆంధ్రప్రదేశ్ లో నెలకొల్పేందుకు సిద్ధమవుతోంది. సీఎం జగన్ సొంత జిల్లా కడపలోని కొప్పర్తి పారిశ్రామిక ప్రాంతంలో ఏర్పాటుకానున్న ఈ ఫ్యాక్టరీ ద్వారా 50 వేల మందికి ఉపాధి దొరకనుంది. ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు.

చైనా స్థాయిలోనే ఏపీలో..
ఆపిల్ సంస్థకు చైనాలో ఆరు తయారీ యూనిట్లు ఉన్నాయని, అక్కడి ఒక్కో ఫ్యాక్టరీలో 1లక్ష నుంచి 6 లక్షల మంది వరకు ఉపాధి పొందుతున్నారని, అదే తరహాలో కడప జిల్లాలోనూ భారీ ఉత్పాదక విభాగాన్ని స్థాపించేలా ఆపిల్ సంస్థతో చర్చలు జరుపుతున్నామని మంత్రి గౌతమ్ రెడ్డి చెప్పారు. దాదాపు ఖరారుకావొచ్చిన ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం, ఇతర వివరాలను అతి త్వరలోనే వెల్లడిస్తామన్నారు.

సౌకర్యాలు కల్పించాకే భూకేటాయింపు..
అదేసమయంలో, లక్షల మందికి ఉపాధి కల్పించే ఔషధ పార్కు ఏర్పాటుకు కూడా జగన్ సర్కారు ప్రాధాన్యం ఇస్తుందని, ఇప్పటికే ప్రముఖ కంపెనీలన్నీ ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహం చూపుతున్నాయని మంత్రి తెలిపారు. పరిశ్రమలు స్థాపించాలనుకుంటోన్న కంపెనీలకు ఊరికే భూమి కేటాయించడం కాకుండా.. విద్యుత్, నీరు, డ్రైనేజ్, రవాణా సౌకర్యం లాంటివి కల్పించిన తర్వాతే భూముల్ని కేటాయించే విధానాన్ని అవలంభిస్తున్నామని, అందుకే మెజార్టీ కంపెనీలు ఏపీ పట్ల ఆసక్తిని ప్రదర్శిస్తున్నాయని గౌతమ్ రెడ్డి అన్నారు.

చంద్రబాబులా ఫేక్ ఎంవోయూలకు నో
గత చంద్రబాబు హయాంలో చేసినట్లుగా ప్రచారం కోసం ఫేక్ ఎంవోయూలు కుదుర్చుకునే విధానాలను జగన్ సర్కారు అవలంభించబోదని, ఆయా సంస్థలతో పక్కాగా చర్చలు, ఒప్పందాలు కుదిరిదిన తర్వాతే ప్రాజెక్టులను ప్రకటిస్తున్నామని గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబు హయాంలో దాదాపు రూ.50వేల కోట్ల ఎంవోయూలపై సంతకాలు చేయగా, అందులో కేవలం రూ.32కోట్ల విలువైన ప్రాజెక్టులు మాత్రమే కార్యరూపందాల్చాయిని, టీడీపీ పాలనలో ఏపీకి వచ్చిన ఒకే ఒక్క మెగా ప్రాజెక్టు ‘కియా' కార్ల తయారీ యూనిట్ కాగా, దానికి కూడా, రాష్ట్రంపై పెను భారం పడేలా తలకుమించిన తయిలాలు ఇచ్చారని మంత్రి గుర్తుచేశారు. రాష్ట్రానికి అన్ని రకాలుగా మేలు జరుగుతుందనుకున్న పెట్టుబడులకు మాత్రమే అంగీకారం తెలుపుతున్నామని, అది కూడా నిర్ణీత కాలపరిమితిలో ఏర్పాటయ్యేలా విధానాలను రూపొందించామని గౌతమ్ రెడ్డి వివరించారు.
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..!












Click it and Unblock the Notifications