చంద్రబాబు మానస పుత్రికకు పెద్ద కష్టమే!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అరకు కాఫీ రైతులకు పెద్ద కష్టం వచ్చింది. ప్రస్తుతం ఏపీలోని ఏజెన్సీలో సాగవుతున్న కాఫీ తోటలలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ప్రఖ్యాతిగాంచిన అరకు వ్యాలీ లోని కాఫీ తోటలలో బెర్రీ బోరర్ అనే పురుగు పట్టింది. ఈ పురుగు కాఫీ తోటలను నాశనం చేస్తుందని రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం కాఫీ రైతులకు అండగా రంగంలోకి దిగింది.
కాఫీ తోటలను పరిశీలించిన మంత్రి గుమ్మడి సంధ్యా రాణి
అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వ్యాలీ మండలం చినలబుడు, పకనకుడి గ్రామాల్లో కాఫీ తోటలలో రాష్ట్ర గిరిజన సంక్షేమ మహిళా సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పర్యటించారు. కాఫీ బెర్రీ బోరర్ పురుగు పట్టిన తోటలను జిల్లా కలెక్టర్ ఎ.ఎస్.దినేష్ కుమార్ తో కలసి సందర్శించి రైతులతో మాట్లాడారు. ప్రస్తుతం కాఫీ తోటలకు పురుగు పట్టిందని దాని నుండి పంటను మాములు స్థితికి తీసుకురావడానికి కృషి చేస్తున్నామని తెలిపారు.

ఆ పంట నాశనం చేస్తున్న పురుగు నివారణకు కమిటీ
సుమారు 80ఎకరాల మేరకు వ్యాపించిందని, దీనిపై కమిటీ వేయడం జరిగిందన్నారు. ఎక్కడైతే ఈ పురుగు ఉత్పన్నామౌతుందో అక్కడ మళ్ళీ పురుగు వ్యాపించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వెల్లడించారు. అరకు కాఫీ ముఖ్యమంత్రి మానస పుత్రికలా చూస్తున్నారని, శాసన సభ ప్రాంగణంలో, పార్లమెంట్ ప్రాంగణంలో కూడా అరకు కాఫీని ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. అరకు కాఫీ పంట అంతర్జాతీయ స్థాయిలో ఆదరణ పొందిందని అన్నారు.
ఎకరానికి రైతులకు 20 వేలు సాయం
కాఫీ రైతులకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని, పూడ్చిపెట్టే ఖర్చు మరియు ఇతర ప్రయోజనాల కోసం ఎకరానికి రూ.5,000/- అందజేయడంతో పాటు కెజి కాఫీ కి రూ.50/- నష్టపరిహారం అందజేయడం జరుగుతుందని గిరిజన సంక్షేమ, మహిళా శిశు సంక్షేమ శాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. పురుగు పట్టిన కాఫీ పంటకు రైతులు నష్టపోకూడదని కేజీకి రూ:50, ఎకరానికి రూ:20 వేలు ప్రభుత్వం అందిస్తోందని అన్నారు.
నష్ట పరిహారం సరిపోకుంటే పెంచే విషయం ఆలోచిస్తాం
అలాగే సుమారు లక్ష మొక్కలను కూడా రైతులకు ఉచితంగా అందించడం జరిగిందన్నారు. విత్తనాలు కూడా ఉచితంగా రైతులకు ఇస్తామని మంత్రి అన్నారు. రాబోయే మూడు సంవత్సరాలు కాఫీ పంటపై దృష్టి పెడతామన్నారు. గిరిజనులు, రైతుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి తెలిపారు. ప్రతీ విషయం రైతులతో చర్చిస్తామని, వారికి ఇచ్చే నష్టపరిహారం సరిపోకపోతే పెంచి ఇచ్చే విషయంలో ఆలోచిస్తామని అన్నారు.
అరకు కాఫీ బ్రాండ్ కాపాడుకుంటామని చెప్పిన మంత్రి
రైతుల పంట భీమాపై ముఖ్యమంత్రితో సంప్రదిస్తామని మంత్రి అన్నారు. ఎట్టిపరిస్థితులలోనూ అరకు కాఫీ బ్రాండ్ కాపాడుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. పురుగు సోకిన తోటలో కాఫీ మొత్తం పంట, కాయలను వెంటనే కొయ్యాలి అని, కాఫీ పంటను కోసేటప్పుడు టార్పలిస్ షీట్ ను పరిచి పంటను కొయ్యాలి అని పేర్కొన్నారు.
పంటను మూడడుగుల లోతు గోతిలో పాతిపెట్టాలి
నేల రాలిన కాఫీ కాయలను కూడా పూర్తిగా సేకరించాలని, పురుగు సొకిన చోటలో అన్నీ కాయలను కోసి వేడినీటిలో 2-3 నిమిషాలు ఉంచాలి. ఆ తరువాత 3 అడుగుల గోతి తీసి, కోసిన కాయలను మట్టిలో పాతిపెట్టాలన్నారు. ఈ పురుగు మొత్తం పంటను నాశనం చేసే ప్రమాదం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలన్నారు.
-
Chandrababu: ప్రజల మధ్యే అధికారులకు బాబు వార్నింగ్...! 1995ను గుర్తుచేస్తూ..! -
రూ.294.20 కోట్లతో రిటైనింగ్ వాల్.. మాట నిలబెట్టుకుంటున్న మంత్రి లోకేష్ -
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నిమ్మల రామానాయుడు.. వారికి 6వేల జీతం పెంపు! -
Raisina Dialogue 2026: అప్పుడు తిట్టినోళ్లే ఇప్పుడు-చంద్రబాబు కామెంట్స్..! -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..!












Click it and Unblock the Notifications