భావోద్వేగం: కంటతడిపెట్టిన అశోక్ గజపతి రాజు, మోడీ చెప్పారని 'చిట్టి గురువు'
కేంద్రమంత్రి, తెలుగుదేశం పార్టీ నేత అశోక్ గజపతి రాజు బుధవారం నాడు భావోద్వేగానికి లోనయ్యారు. కంటతడి పెట్టారు కూడా.
విజయనగరం: కేంద్రమంత్రి, తెలుగుదేశం పార్టీ నేత అశోక్ గజపతి రాజు బుధవారం నాడు భావోద్వేగానికి లోనయ్యారు. కంటతడి పెట్టారు కూడా.

దత్తత గ్రామంలో అశోక్
విజయనగరం జిల్లాలోని ద్వారంపూడి గ్రామాన్ని ఆయన దత్తత తీసుకున్నారు. ఈ గ్రామాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పాఠశాలకు ఆయన వెళ్లారు.

పేరెంట్స్కు చదవడం, రాయడం నేర్పుతుంటే చలించిపోయారు
అక్కడ తమ తల్లిదండ్రుకు చదవడం, రాయడం నేర్పుతున్న విద్యార్థినులను చూసిన అశోక్ గజపతి రాజు చలించిపోయారు. వారిని చూసి ఆనందించారు.
Recommended Video

Shivsena MPs Surrounded Civil Aviation Minister Ashok Gajapathi Raju In Parliament - Oneindia Telugu

ఆనందబాష్పాలు
అశోక్గజపతి రాజు కళ్ల నుంచి ఆనందభాష్పాలు వచ్చాయి. ఈ సందర్భంగా ఓ విద్యార్థిని మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా చిట్టి గురువులు గురించి మాట్లాడారని చెప్పారు.

మొక్కలు నాటిన అశోక్
అనంతరం గ్రామంలో అశోక్ గజపతిరాజు మొక్కలను నాటారు. ఆ తర్వాత గ్రామస్తులతో ముచ్చటించారు. గ్రామ సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు.












Click it and Unblock the Notifications