ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!!
నియోజకవర్గాల పెంపు రాజకీయంగా హీట్ పెంచుతోంది. లోక్ సభతో సహా అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలు 50 శాతానికి పెరగను న్నాయి. ఈ మేరకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశాల్లో నే బిల్లును తీసుకొచ్చేందుకు సిద్దమైంది. మహిళా రిజర్వేషన్లు అమలు చేయనుంది. నియోజక వర్గాల పునర్విభజన ద్వారా ఏపీలో ఏ జిల్లాలో ఎన్ని సీట్లు పెరుగుతాయనేది దాదాపు స్పష్టత వచ్చింది. అదే సమయంలో మహిళలకు కేటాయించే సీట్లు ఖరారయ్యాయి. ఎంపీ.. ఎమ్మెల్సీ సీట్ల లెక్కలు కొలిక్కి వచ్చాయి. దీంతో, ఈ పెరిగే సీట్లు ఎవరికి కలిసి వస్తాయనే చర్చ మొదలైంది.
ఏపీలో నియోజకవర్గాల పునర్విభజన ద్వారా కేంద్రం తాజా ప్రతిపాదనల మేరకు ప్రస్తుతం ఉన్న 175 స్థానాలు 263కి చేరనున్నాయి. అదే విధంగా ప్రస్తుతం ఉన్న 25 లోక్ సభ స్థానాలు 38కి చేరనున్నాయి. అయితే.. ఈ ప్రాతిపాదికన జిల్లాల వారీగా పెరిగే సీట్ల పైన ఒక అంచనా సిద్దం చేసారు. గ్రేటర్ రాయలసీమలో ఉన్న ఆరు జిల్లాల్లో అనంతపురంలో ప్రస్తుతం ఉన్న 14 స్థానాలు ఇక 21కి చేరనున్నాయి. అదే విధంగా కర్నూలు జిల్లాలో 14 నుంచి 21కి, కడపలో 10 నుంచి 15కు, చిత్తూరు లో 14 నుంచి 21, నెల్లూరులో పది నుంచి 15కు, ఇక.. ప్రకాశంలో 12 స్థానాలు 18కి పెరగనున్నాయి. దీంతో.. మొత్తం ఈ రీజియన్ లో ప్రస్తుతం ఉన్న 74 సీట్లు 37 పెరగటం ద్వారా 111కి చేరనున్నాయి. 2019 ఎన్నికల్లో ఈ రీజియన్ లో వైసీపీ ఏకపక్షంగా సీట్లు గెలవగా .. 2024 లో సీన్ రివర్స్ అయి కూటమి మెజార్టీ సీట్లు దక్కించుకుంది.

జిల్లాల వారీగా పెరిగే సీట్లు.. మారుతున్న లెక్కలు
ఇక, గుంటూరు జిల్లాలో ప్రస్తుతం ఉన్న సీట్లు 17 నుంచి 25కి చేరనున్నాయి. కృష్ణా లో పునర్వి భజన తరువాత సీట్లు 24కు పెరగనున్నాయి. దీంతో. ఈ రెండు జిల్లాల్లో 49 స్థానాలు కాను న్నాయి. ఇక్కడ ప్రస్తుతం కూటమి ఆధిపత్యం కొనసాగుతోంది. వైసీపీకి పునర్విభజన తరువాత ఎలాంటి పరిస్థితులు ఏర్పడుతాయనేది కీలకంగా మారనుంది. ఇక, రాష్ట్రంలో అధికారం డిసైడ్ చేసే ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రస్తుతం ఉన్న 34 స్థానాల 50కి చేరనున్నాయి. తూర్పు గోదావరి లో ప్రస్తుతం 19 ఉండగా 28కి పెరగనున్నాయి. అదే విధంగా పశ్చిమ గోదావరిలో 15 స్థానాలు 22కి చేరుతాయి. ఇక్కడ పవన్ తో సహా కూటమి ఏకపక్షంగా విజయం సాధించింది. ఈ జిల్లాల్లో సామాజిక సమీకరణాలు.. నియోజకవర్గాల పెంపు అధికారం డిసైడ్ చేయటంలో కీలకంగా మారనున్నాయి. ఇక, ఉత్తరాంధ్రలో విశాఖలో 15 నుంచి 23, విజయనగరం లో ప్రస్తుతం ఉన్న 9 స్థానాలు 15కు, శ్రీకాకుళంలోనూ 15 కు సీట్లు పెరగటం ద్వారా మొత్తంగా 34 స్థానాలు 53 కి చేరనున్నాయి. దీంతో.. అధికారంలోకి రావటానికి మేజిక్ ఫిగర్ 132 కానుంది. ప్రతిపక్ష హెదా దక్కాలంటే 26 స్థానాలు రావాల్సి ఉంటుంది. మంత్రివర్గ సభ్యుల సంఖ్య 39 వరకు అవకాశం ఉండనుంది. దీంతో.. నియోజకవర్గాల పునర్విభజన ద్వారా కూటమి వర్సస్ వైసీపీ మధ్య ఎవరికి ఏ మేర కలిసి వస్తుందనే అంచనాలు మొదలయ్యాయి.
-
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
ఏపీలో మహిళలకు దక్కే నియోజకవర్గాలు లిస్టు ఇదే, కీలక మంత్రుల స్థానాలు సైతం..!! -
దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం అన్యాయం: సీఎం రేవంత్ రెడ్డి -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
ఎల్పీజీ స్ధానంలో PNG కనెక్షన్ తీసుకుంటే - ఏపీ సర్కార్ భారీ సబ్సిడీ ఆఫర్ ..! -
ఏపీలో పర్యాటకానికి మహర్దశ.. కీలక ఆదేశాలిచ్చిన సీఎం చంద్రబాబు -
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
Amaravati: పీఎంవో అత్యవసర ఆదేశాలు-28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక భేటీ..! -
ఏపీ సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ భేటీ..! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్











Click it and Unblock the Notifications