నంద్యాలలో దారుణం.. రాళ్లతో కొట్టి వైసీపీ నేతను హత్య చేశారు!
ఏపీలోని నంద్యాల జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. జిల్లాలోని వైసీపీకి చెందిన కీలకనేతను దుండగులు అతి కిరాతకంగా హత్య చేశారు. దీంతో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ హత్యల పరంపర కొనసాగుతోందా అనే అనుమానాలు బలపడుతున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచే ఈ తరహా హత్యలు జరుగుతున్నాయని వైసీపీ నేతలు ఆరోపిస్తుంటే.. చట్టం తన పని తాను చేసుకుపోతుందంటూ అధికార పార్టీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా నంద్యాల జిల్లాలో ఈ హత్య సంచలనంగా మారడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
నంద్యాల జిల్లా మహానంది మండల పరిధిలోని సీతారామపురంలో దారుణం చోటుచేసుకుంది. మండలానికి చెందిన వైసీపీ నేత సుబ్బారాయుడిని దుండగులు రాళ్లతో కొట్టి అత్యంత కిరాతకంగా హత్య చేశారు. ఈ దాడిలో సుమారు 40 మంది ఉన్నారని సమాచారం. అయితే, గ్రామానికి చెందిన కొంతమంది టీడీపీ నాయకులే తన భర్తను పొట్టపపెట్టుకున్నారంటూ సుబ్బారాయుడు భార్య తీవ్ర ఆరోపణలు చేశారు. మృతుడు సుబ్బారాయుడు మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణికి అత్యంత సన్నిహిత అనుచరుడని సమాచారం. ఈ కారణంగానే సుబ్బారాయుడుని అత్యంత దారుణంగా దాడి చేసి చంపేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ హత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

నంద్యాల జిల్లాలో వైయస్ఆర్సీపీ కార్యకర్త దారుణ హత్య
— YSR Congress Party (@YSRCParty) August 4, 2024
మహానంది మండలం సీతారామపురంలో వైయస్ఆర్సీపీ కోసం ఎన్నికల్లో పనిచేసిన పెద్ద సుబ్బారాయుడు
కక్ష పెట్టుకుని రాళ్లు, కర్రలు, కత్తులతో దాడికి తెగబడిన @JaiTDP గుండాలు. దాడిలో పెద్ద సుబ్బారాయుడు అక్కడికక్కడే మృతి.. అతని భార్య…
రాజకీయ హత్యా? లేక..
సమాచారం అందుకున్న పోలీసలు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే సీతారామపురం గ్రామంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పికెట్ను ఏర్పాటు చేశారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం నంద్యాల ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. ఇప్పటికే ఎస్పీ అదిత్ రాజ్ సింగ్ రాణా గ్రామంలో పర్యటించారు.
నంద్యాల జీజీహెచ్లో సుబ్బారాయుడు కుటుంబ సభ్యులతో మాట్లాడి సమాచారాన్ని సేకరించారు. డీఎస్పీ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని మృతుని కుటుంబసభ్యులకు హామీ ఇచ్చారు. ఇది రాజకీయ హత్యా? లేక మరేమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సుబ్బరాయుడు హత్యతో ఏ క్షణం ఏం జరుగుతుందోనని గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications