దాడులు కొత్తేమీ కాదు: వనజాక్షిపై దాడి మీద అశోక్ బాబు స్పందన
హైదరాబాద్: కృష్ణా జిల్లా ముసునూరు ఎమ్మార్వో వనజాక్షిపై జరిగిన దాడిపై ఎపిఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు గమ్మత్తుగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వోద్యోగులపై దాడులు జరగడం కొత్తేమీ కాదంటూ వనజాక్షిపై జరిగిన దాడిని తేలిగ్గా కొట్టిపారేసే ప్రయత్నం చేశారు.
గత ప్రభుత్వాల్లో కూడా ప్రభుత్వోద్యోగులపై దాడులు జరిగాయని ఆయన అన్నారు. వనజాక్షిపై జరిగిన దాడి ఘటన మీద ప్రభుత్వం విచారణ కమిటీని వేసిందని ఆయన గుర్తు చేశారు. ఎపిలో ఉద్యోగుల బదిలీలను ఆగస్టులో చేయడం సరి కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

విజయవాడకు ప్రభుత్వ కార్యాలయాల తరలింపుపై ఉద్యోగులను కూడా సంప్రదించాలని ఆయన కోరారు. ప్రభుత్వ భవనాలను కట్టి నతర్వాత రాజధానిని ఎపికి తరలించాలని తాము గతంలోనే ప్రభుత్వాన్ని కోరామని ఆయన చెప్పారు.
ఏయే శాఖలను, ఎంత మంది ఉద్యోగులను తరలిస్తారో తెలియజేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఉద్యోగులు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారో లేదో తాము తెలియజేస్తామని అశోక్ బాబు అన్నారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications