షాక్: వారిద్దరూ మంచి మిత్రులు, ఎక్కడికెళ్ళినా భూమాతో పాటే కానీ చివరికిలా.....
ఓరేయ్ ఏవి...అనే పిలుపు తనకు విన్పించదు అంటూ భూమా నాగిరెడ్డి స్నేహితుడు, ఆయన దూరపు బంధువు ఏవీ సుబ్బారెడ్డి కన్నీరు మున్నీరు అవుతున్నారు.
కర్నూల్:ఓరేయ్ ఏవి...అనే పిలుపు తనకు విన్పించదు అంటూ భూమా నాగిరెడ్డి స్నేహితుడు, ఆయన దూరపు బంధువు ఏవీ సుబ్బారెడ్డి కన్నీరు మున్నీరు అవుతున్నారు.
ఏవీ సుబ్బారెడ్డి, భూమా నాగిరెడ్డిలు చిన్ననాటి స్నేహితులు. ఇద్దరూ దూరపు బంధువులు. వీరి స్నేహం చూసి అసూయపడేవారు కూడ లేకపోలేదు.ఎవరెన్ని రకాలుగా వ్యవహరించినా కాని భూమాను మాత్రం ఏవీ సుబ్బారెడ్డి వీడలేదు.
భూమా నాగిరెడ్డి ఎక్కడికెళ్ళినా ఏవీ లేకుండా ఆయన పర్యటనలు సాగేవి కావు.భూమా ఏ పార్టీ మారినా కాని ఆయన వెంటే ఏవీ సుబ్బారెడ్డి నడిచాడు.తనతో పాటు సమానంగా ఏవీ సుబ్బారెడ్డిన భూమా నాగిరెడ్డి గౌరవించేవాడు.
తాను పదవిలో ఉంటే ఏవీ సుబ్బారెడ్డి కూడ పదవిలో ఉన్నట్టే ఆయన ప్రాధాన్యత ఇచ్చేవారు భూమా నాగిరెడ్డి. ఏవీ సుబ్బారెడ్డి కేరాఫ్ భూమా నాగిరెడ్డిగా మారింది.
ఓరేయ్ ఏవీ అని ఆప్యాయంగా పిలిచే భూమా గుండెపోటుతో మరణించడంతో ఏవీ సుబ్బారెడ్డి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.ప్రాణస్నేహితుడు హఠాత్తుగా మరణించడంతో ఆయన దిగాలుగా భూమా పార్థీవ దేహం వద్దే కూర్చొని విలపిస్తున్నారు.