బాపుకు నివాళి: ఏడ్చిన బాలకృష్ణ, వీఐపీలు (పిక్చర్స్)
చెన్నై: ప్రముఖ దర్శకుడు బాపు మృతదేహాన్ని సందర్సించి, నివాళులు అర్పించడానికి సినీ ప్రముఖులతో పాటు ఇతర ప్రముఖులు హైదరాబాదు నుంచి తరలి వచ్చారు. తెలుగు సినీ పరిశ్రమ ఆయన మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరైంది. పలు రంగాల ప్రముఖులు బాపు పార్ధివ దేహానికి నివాళులు అర్పించారు.
బాపు చివరి సినిమా శ్రీరామరాజ్యంలో నటించిన బాలకృష్ణ కంటతడి పెట్టుకున్నారు. కళ్లు చెమ్మగిల్లిన స్థితిలో ఆయన కాసేపు బాపు మృతదేహం వద్ద నించుండిపోయారు. పెళ్లిపుస్తకం హీరోయిన్ దివ్యవాణి బాపు మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కాసేపు బాపు పార్ధివ దేహం వద్ద కూర్చుండిపోయారు.
సినీ ప్రముఖులు చిరంజీవి, శరత్ బాబు, కె. రాఘవేంద్ర రావు, సింగీతం శ్రీనివాస రావు, ముత్యాలముగ్గు హీరోయిన్ సంగీత, శంకరాభరణం రాజ్యలక్ష్మి, ప్రభ తదితరులు బాపుకు నివాళులు అర్పించారు. బాపు చివరి దశలో చేపట్టిన ప్రాజెక్టును పూర్తి చేస్తామని రఘురామ కృష్ణం రాజు చెప్పారు. బాపు కుమారుడు వేణుగోపాల్ సోమవారం రాత్రి చెన్నైకి చేరుకున్నారు

కంటతడి పెట్టిన బాలయ్య
బాపు చివరి సినిమా శ్రీరామరాజ్యంలో నటించిన నందమూరి హీరో బాలకృష్ణ బాపు మృతదేహానికి నివాళులు అర్పించి కంట తడి పెట్టారు.

బాలయ్య ఇలా...
బాలకృష్ణ బాపు మృతదేహం వద్ద ఉద్వేగాన్ని నిలువరించుకోలేకపోయారు. కాసేపు పార్ధివ దేహం వద్ద నించుండి ఏడ్చేశారు.

జీర్ణించుకోలేకపోతున్నా...
బాపు మన మధ్య లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని, ఎన్నో ప్రభంజనాలు సృష్టించిన బాపు ఆఖరి చిత్రం శ్రీరామరాజ్యంలో నటించడం అదృష్టంగా భావిస్తున్నానని బాలయ్య అన్నారు.

చిరంజీవి నివాళి
బాపు పార్ధివదేహానికి మెగాస్టార్ చిరంజీవి నివాళులు అర్పించారు. బాపు దర్శకత్వం వహించిన మంత్రిగారి వియ్యంకుడు, మనవూరి పాండవులు చిత్రంలో చిరంజీవి నటించారు.

అందమైన అనుభవాలు...
బాపుతో తనకు ఎన్నో అందమైన అనుభవాలు, జ్ఞాపకాలు ఉన్నాయని రాజ్యసభ సభ్యుడు, సినీ నటుడు చిరంజీవి అన్నారు.

నాకు శిక్షణ ఇచ్చాయి..
తాను నటించిన బాపు సినిమాలు మంత్రిగారి వియ్యంకుడు, మనవూరి పాండవులు తనకు ఓ రకంగా శిక్షణ ఇచ్చాయని చిరంజీవి చెప్పుకున్నారు.

సింగీతం శ్రీనివాసరావు
బాపు పార్ధివ దేహానికి ప్రముఖ సినీ దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు నివాళులు అర్పించారు. బాపు భౌతిక కాయంపై ఆయన పూలమాల వేశారు.

బాపు కుమారుడితో బాలు...
బాపు కుమారుడు వేణుగోపాల్ రావును ప్రముఖ సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఓదారుస్తూ ఇలా కనిపించారు.

బాపు భౌతిక కాయం వద్ద...
బాపు భౌతిక కాయానికి ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నివాళులు అర్పిచారు. గత నాలుగైదేళ్లుగా తాను బాపుకు దగ్గరయ్యాయని ఆయన గుర్తు చేసుకున్నారు.

శేఖర్ కమ్ముల నివాళి
బాపు మృతదేహానికి ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు శేఖర్ కమ్ముల నివాళులు అర్పించారు. తెలుగు సినీ ప్రపంచం బాపు మృతికి శోకసముద్రమైంది.

భానుచందర్ నివాళి
ప్రముఖ దర్శకుడు బాపు మృతదేహానికి ప్రముఖ సినీ నటుడు భానుచందర్ నివాళులు అర్పించారు. సినీ ప్రపంచం బాపుకు తుది వీడ్కోలు ఇవ్వడానికి తరలి వచ్చింది.

శైలజ, సుధాకర్ నివాళి
బాపు పార్ధివ దేహాన్ని ప్రముఖ గాయని శైలజ, నటుడు సుధాకర్ దంపతులు సందర్శించి, నివాళులు అర్పించారు.
-
మౌళి "దొంగనా కొడుకు".. మైత్రీ మూవీస్ సంచలన ప్రకటన..!! -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
పాన్ ఇండియా సినిమాలో బోల్డ్ సీన్.. చేయనని మొండికేస్తున్న స్టార్ హీరోయిన్! -
అలా అమరావతిలో.. కొత్త సినిమా కోసం పవన్ కళ్యాణ్ నయా ప్లాన్ !! -
పవర్ స్టార్ "OG" సీక్వెల్ షూటింగ్ షురూ.. టైటిల్ ఇదే ?? -
‘బాహుబలి2’ను దాటలేకపోయిన ‘ధురంధర్2’ -
NTRNeel: వాడి బాడీ బాక్సాఫీస్ రా: `హెర్కులెస్`.. !! -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications