అధిక వడ్డీ ఆశపెట్టి మోసం: ముగ్గురి అరెస్టు

ఆ సంఘటన వివరాలను తిరుపతి అర్బన్ ఎస్పీ గోపినాధ్ జెట్టీ సోమవారం తన కార్యాలయంలో మీడియా ప్రతినిధులకు అందించారు. తిరుపతిలోని శ్రీనివాసం ఎదురుగా ఉన్న మున్సిపల్ కాంప్లెక్స్లో 16వ నెంబరు షాపును బాడుగకు తీసుకుని ఈ కంపెనీని ఏర్పాటు చేశారని తెలిపారు.
ఈ కంపెనీకి ఎండిగా విజయనగరానికి చెందిన గురవం శ్రీనివాస పట్నాయక్ (50) వ్యవహరిస్తుండగా, ఎమ్మార్పల్లి, రామాంజులపల్లికి, ఉద్యోగనగర్కు చెందిన గొల్ల సామ్యూల్ (35), హైదరాబాద్కు చెందిన చిట్టిమనేని సుగుణ (45) సభ్యులుగా వ్యవహరించేవారన్నారు. ఈ కంపెనీలో 10వేల రూపాయలు కడితే, వెంటనే కట్టిన సభ్యునికి 3వేల రూపాయల నగదు, లేదా ఒక గ్రాము బంగారం అప్పుడే ఇస్తారు. వారానికి వెయ్యి రూపాయలు వడ్డీ చెల్లిస్తారు.
లక్ష రూపాయలు కడితే సభ్యునికి 30వేల రూపాయల అప్పుడే చెల్లించి, వారానికి 10వేల రూపాయలు వడ్డీ ఇస్తామని, 5 నెలలకు లక్ష రూపాయులు రెట్టింపు చేసి రెండు లక్షల రూపాయలు ఇస్తామని ప్రజలను నమ్మించారన్నారు. వీరి మాయ మాటలు నమ్మి 20 మంది చేత 10 వేల రూపాయలు, మరో ఇద్దరి దగ్గర రెండు లక్షల రూపాయాలు చొప్పున కట్టించుకున్నారన్నారు.












Click it and Unblock the Notifications