త్వరలోనే ఆధారాలతో మీడియా ముందుకు వస్తా: భూమా అఖిలప్రియ
బెయిల్ పై విడుదలైన తర్వాత మాజీ మంత్రి భూమా అఖిలప్రియ నంద్యాల తాలూకా పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. ఏవీ సుబ్బారెడ్డిపై జరిగిన దాడి విషయంలో ఆమెకు కండిషన్ బెయిల్ లభించిన సంగతి తెలిసిందే. తాలూకా పోలీస్ స్టేషన్ కు వచ్చి సంతకం చేసి వెళ్లారు. అఖిలప్రియ స్టేషన్ కు రావడంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతోపాటు భూమా అభిమానులు భారీసంఖ్యలో చేరుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.

ప్రపంచంలోకానీ, దేశంలోకానీ ఎక్కడా జరగన వింత సంఘటన నంద్యాలలో జరిగిందన్నారు. మహిళ మీద దాడి చేసి.. మళ్లీ అదే మహిళ మీద కేసు పెట్టి స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారన్నారు. ఇలాంటి సంస్కృతి తాను ఎక్కడా చూడలేని, అలాగే వినలేదన్నారు. దీన్నిబట్టి రాష్ట్రంలో ఉన్న మహిళల పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థమవుతుందన్నారు. తన మీద కేసు నమోదు చేయించడమే కాకుండా.. కేసు నమోదుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేసినవారి ఇంట్లో ఉండే మహిళలు కూడా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నానన్నారు. ఈ దాడికి సంబంధించిన పూర్తి ఆధారాలతో త్వరలోనే తాను మీడియా ముందుకు వస్తానన్నారు.

ఈ నెల 16న నారా లోకేష్ యువగళం పాదయాత్రనంద్యాల నియోజకవర్గానికి చేరుకుంది. కొత్తపల్లి దగ్గర లోకేష్కు స్వాగతం పలికేందుకు భూమా అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి వర్గీయుల మధ్య వాగ్వాదం నడిచింది.. అఖిలప్రియ వర్గీయుడు ఏవీ సుబ్బారెడ్డిపై దాడి చేశాడు. వెంటనే పోలీసులు ఏవీ సుబ్బారెడ్డిని అక్కడినుంచి కారులో పంపించేశారు. ఈ దాడి ఘటనపై ఏవీ సుబ్బారెడ్డి నంద్యాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. అఖిలప్రియతోపాటు పలువురిపై పోలీసులు కేసు నమోదు చేసి నంద్యాల తరలించారు. కోర్టు రిమాండ్ విధించడంతో ఆమెను జైలుకు పంపించారు. కర్నూలు కోర్టులో షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది.
-
కిల్లర్ మిల్లర్.. గాయాన్ని సైతం లెక్కచేయని మొండిధైర్యం -
ఈ రాశి వారికి ఆస్తి తగాదాలు తప్పవు..!! -
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
కుప్పకూలిన Gold ETF.. 18 ఏళ్లలో అతిపెద్ద పతనం.. -
తన భార్య గురించి విజయ్ సంచలన కామెంట్స్. 30 ఏళ్లు ఎదురుచూసి! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
Humsafar Express: శ్రీకాకుళం-తిరుపతి కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్-ఆ రోజు నుంచే..! -
సెకెనుకు 40,000 కి. మీ వేగంతో.. భూమి వైపు -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
ఏపీలో ఈ నియోజకవర్గాలు ఇక మహిళలకే, సీనియర్లు.. మంత్రుల స్థానాలు ఔట్..!! -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
అది ఇస్త్రీ కొట్టా ? సాఫ్ట్ వేర్ కంపెనీనా ?? .. అకౌంట్ లో రూ.598 కోట్లు !!












Click it and Unblock the Notifications