జగన్ కు బిగ్ షాక్.. భారతీ సిమెంట్స్ కు ఊహించని ఝలక్!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది. భారతి సిమెంట్స్ విషయంలో జగన్ కు బిగ్ షాక్ ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం రెడీ అయింది. వైయస్ జగన్ కుటుంబానికి చెందిన భారతి సిమెంట్ కార్పొరేషన్ కు ఇచ్చిన రెండు సున్నపు గని లీజులను రద్దు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెడీ అవుతోంది.
భారతి సిమెంట్స్ కు ఇచ్చిన రెండు లీజుల రద్దుకు నిర్ణయం
కేంద్రప్రభుత్వ గనుల నిబంధన ఉల్లంఘన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కేంద్ర గనులశాఖ భారతిసిమెంట్స్ లీజ్ విషయంలో అభ్యంతరం వ్యక్తం చేయడంతో విచారణ జరిపిన ప్రభుత్వం, అడ్వకేట్ జనరల్ నివేదిక ఆధారంగా ఈ సున్నపురాయి లీజులు చట్టవిరుద్ధంగా మంజూరు చేసినట్టు గుర్తించింది. రాష్ట్ర గనులశాఖ తుది నివేదిక సమర్పించిన వెంటనే భారతి సిమెంట్స్ కు ఇచ్చిన రెండు లీజుల రద్దు ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.

కేంద్ర నిబంధనలు ఉల్లంఘించిన భారతీ సిమెంట్స్
సున్నపురాయి వంటి ప్రధాన ఖనిజాల లీజులు వేలం ద్వారా మాత్రమే ఇవ్వాలని 2015లో కేంద్ర గనుల శాఖ సవరించిన నిబంధనలలో ఉంది. అంతేకాకుండా 2015 జనవరి 12 కు ముందు లెటర్ ఆఫ్ ఇంటెంట్ జారీ అయినా, 2017 జనవరి 11 నాటికి అన్ని అనుమతులు పొందకపోతే ఆ లెటర్ ఆఫ్ ఇంటెంట్ స్వయంగా రద్దు అవుతుంది.
ఎన్నికలకు ముందు భారతి సిమెంట్స్ కు రెండు సున్నపురాయి గనుల లీజులు
ఈ నిబంధనలను ఉల్లంఘించి 2024 ఎన్నికలకు కొద్దిరోజుల ముందు నాటి సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి, తన సతీమణి భారతి డైరెక్టర్ గా ఉన్న భారతి సిమెంట్స్ కు రెండు లీజులను మంజూరు చేశారు. కడప జిల్లా కమలాపురంలోను, ఎర్రగుంట్ల మండలాల్లోని 509.18ఎకరాలు, 235.56ఎకరాల భూములలో ఈ లీజులను ఇచ్చారు. ఈ భూములు వాస్తవానికి రఘురాం సిమెంట్స్ కు చెందినవి కాగా, 2009లో భారతి సిమెంట్స్ వాటిని కొనుగోలు చేసింది.
లీజుల లెటర్ ఆఫ్ ఇంటెంట్ రద్దుపై కోర్టుకు భారతి సిమెంట్స్
ఆ సమయంలోనే సున్నపురాయి లీజు కోసం దరఖాస్తు చేసుకొని లెటర్ ఆఫ్ ఇంటెంట్ పొందినా, నిర్ణీత సమయానికి అనుమతులు పొందక పోవడంతో ఆ లెటర్ ఆఫ్ ఇంటెంట్ రద్దు చేస్తూ ప్రభుత్వం నోటీసు జారీ చేసింది. దీనిపై భారతి సిమెంట్ హైకోర్టును ఆశ్రయించగా కోర్టు స్టేటస్ కో విధించింది. ఆ తర్వాత 2023లో సంస్థ వాదనలు విని నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
గత ఎన్నికలకు ముందు లీజులు, రద్దు చేసేందుకు రెడీ అయిన ప్రభుత్వం
దీంతో 2024 ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి నెల రోజుల ముందు నాటి జగన్ ప్రభుత్వం భారతి సిమెంట్ కు రెండు లీజులను ఇస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. అయితే ఈ లీజులు కేంద్ర చట్టానికి విరుద్ధంగా ఉండడంతో కేంద్ర గనుల శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ లీజుల పైన పునః పరిశీలన చేయాలని కోరింది. దీంతో దీనిపైన అడ్వకేట్ జనరల్ నివేదిక ఆధారంగా ఇది చట్ట విరుద్ధంగా జరిగినట్టు గుర్తించింది. రాష్ట్ర గనుల నివేదిక తుది నివేదిక రాగానే ఈ లీజులను రద్దు చేయనుంది.
-
షాకింగ్ : పెళ్లిపై ఏపీ యువత అనాసక్తి .. గణాంకాలు ఏం చెప్తున్నాయంటే -
జగన్ లాంటి అన్న ఉంటే వేరే శత్రువు అవసరం లేదు! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications