ఏపీలో బర్డ్ ఫ్లూ భయం .. విశాఖలో మృతిచెందిన కాకులు .. బాగా తగ్గుతున్న చికెన్ ధరలు
కరోనా కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న పౌల్ట్రీ పరిశ్రమ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఇదే సమయంలో మూలిగే నక్క మీద తాటిపండు పడిన చందంగా బర్డ్ ఫ్లూ పౌల్ట్రీ పరిశ్రమకు శరాఘాతంగా మారుతోంది. ఇప్పటికి ఏడు రాష్ట్రాలలో బర్డ్ ఫ్లూ కేసులు నమోదు కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ బర్డ్ ఫ్లూ భయం వేధిస్తోంది.
ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా బర్డ్ ఫ్లూ వల్లే అన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.

విశాఖపట్నంలో ఆరు కాకులు, ఒక పిచ్చుక మృతి
తాజాగా విశాఖపట్నంలో ఆరు కాకులు, ఒక పిచ్చుక మృతిచెందడంతో బర్డ్ ఫ్లూ కలకలం రేగింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కోళ్ళు , పక్షులు, కాకులు మృత్యు వాత పడుతుంటే ఈ ఘటన స్థానికులకు ఆందోళన కలిగిస్తుంది .
విశాఖ నగరంలోని కొత్తపాలెం పరిధి సాయి నగర్ , భగత్ సింగ్ నగర్ , గణేష్ సాయి నగర్ లలో 3 కాకులు , దేవరాపల్లిలో మరో 3 కాకులు , ఒక పిచ్చుక మృతి చెందాయి .
బర్డ్ ఫ్లూ కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఆందోళన నెలకొంది . దీంతో చికెన్ ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇక సంక్రాంతి పండుగ వస్తున్న సమయంలో తాజా పరిస్థితి పౌల్ట్రీ పరిశ్రమకు తీరని నష్టం చేసింది .

గణనీయంగా పడిపోయిన చికెన్ ధరలు
గత పది రోజులుగా చికెన్ అమ్మకాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి . మొత్తానికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఎక్కడ ఏ పక్షి చనిపోయినా బర్డ్ ఫ్లూ నా అన్న అనుమానం వ్యక్తం అవుతుంది . మొన్నటికి మొన్న గుంటూరులోనూ కాకులు మృతి చెందటం కలకలం రేపిన విషయం తెలిసిందే . గుంటూరు జిల్లాలో కొల్లిపర మండలం గుదిబండివారిపాలెంలో కాకులు మృతిచెందడంతో స్థానికంగా ఆందోళన వ్యక్తమవుతోంది. గుదిబండి వారి పాలెం ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఆరు కాకులు చచ్చిపోవడంతో, కాకుల మృతి బర్డ్ ఫ్లూ కారణంగానే అంటూ ప్రచారం కొనసాగుతుంది.

పౌల్ట్రీ వర్గాలకు బర్డ్ ఫ్లూ షాక్... వ్యాపారంపై ఆందోళనలో పౌల్ట్రీ యాజమాన్యం
మొన్నటి వరకు కరోనా మహమ్మారి కారణంగా పౌల్ట్రీ పరిశ్రమ తీవ్రంగా దెబ్బతింది . ఇప్పుడు మరో మారు పౌల్ట్రీ వర్గాలకు బర్డ్ ఫ్లూ షాక్ ఇచ్చింది . దీంతో ఈ ఏడాది వ్యాపారంపై పౌల్ట్రీ వర్గాల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది . ఒకపక్క కరోనాకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిందని అందరూ సంతోషిస్తున్న సమయంలో ఇలా బర్డ్ ఫ్లూ వైరస్ గత పదిరోజులుగా ఊపిరాడనీకుండా చేసింది . గత పదిరోజుల్లో రాజస్థాన్ , హర్యానా , హిమాచల్ ప్రదేశ్ , మధ్య ప్రదేశ్ , కేరళ , కర్ణాటక రాష్ట్రాలలో విస్తరించింది .ఏపీలోనూ బర్డ్ ఫ్లూ భయం పట్టుకుంది .

అధికారులు అలెర్ట్ .. పక్షులకు పరీక్షలు , వలస పక్షులపై ఆరా
ఇప్పటికే అప్రమత్తం అయిన ప్రభుత్వం అధికారులకు తగిన ఆదేశాలు జారీ చెయ్యగా అధికారులు ఎక్కడ ఎలాంటి పక్షుల మృతి ఘటనా జరిగినా వెంటనే శాంపిల్స్ సేకరించి ల్యాబ్స్ కు పంపిస్తున్నారు. పౌల్ట్రీ యజమానులను అలెర్ట్ చేస్తున్నారు. వలస పక్షులపై ఆరా తీసి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు వదంతులు నమ్మొద్దని చెప్తున్నారు .
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications