తల్లిని చంపిందన్నారుగా: మోడీపై జూపూడి, బాబుకు ఉమ భరోసా
న్యూఢిల్లీ/హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం పైన, ప్రధాని నరేంద్ర మోడీ పైన తెలుగుదేశం పార్టీ నేత జూపూడి ప్రభాకర రావు గురువారం నాడు తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ తల్లిని చంపిందని ప్రధాని మోడీయే అన్నారని వ్యాఖ్యానించారు.
ఇప్పుడు బిడ్డను చంపే ప్రయత్నం బిజెపి చేస్తోందని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం పైన నమ్మకం పోయిందన్నారు. ఏపీ పైన బీజేపీ కనీసం సవతి తల్లి ప్రేమ కూడా చూపించడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ కంటే ఘోరంగా మోసం చేయాలని బిజెపి భావిస్తోందా అని నిలదీశారు.
ఏపీకి ప్రత్యేక హోదా పైన ప్రధాని మోడీయే స్వయంగా ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. బిజెపి తన మేనిఫెస్టోను అమలు చేయాలని కోరుతున్నామన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ అధ్యక్షులు జగన్ కోరుకున్నట్లుగానే జరగాలని బిజెపి భావిస్తోందా అన్నారు.

తెలుగుదేశం, బిజెపి రాజీపడిందని వైసిపి ఆరోపిస్తున్నా తాము ఓపిక పడుతున్నామని చెప్పారు. ప్రజలకు, ఏపీకి అన్యాయం చేస్తే వారి పక్షాన టిడిపి తప్పకుండా పోరాడుతుందని చెప్పారు.
పోలవరం మేమే నిర్మిస్తాం: ఉమా భారతి
పోలవరం జాతీయ ప్రయోజనాలను ఉద్దేశించిన ప్రాజెక్టు అని కేంద్రమంత్రి ఉమాభారతి అన్నారు. పోలవరం నిర్మాణ ఖర్చును కేంద్రమే భరిస్తుందని చెప్పారు. ఒడిశా అభ్యంతరాల పైన ఆ రాష్ట్ర ఎంపీలతో చర్చించామని చెప్పారు. మరోసారి చర్చకు ఒడిశా ఎంపీలను ఆహ్వానించామన్నారు.
కాగా, అంతకుముందు, అరుణ్ జైట్లీ మాట్లాడుతూ.. ఏపీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రెవెన్యూ లోటును భర్తీ చేస్తామని, ఇప్పటి దాకా రూ.6,403 కోట్లు ఇచ్చామని, తొలి ఏడాది రెవెన్యూ లోటుగా రూ.2,800 కోట్లు ఇచ్చామని, పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇస్తామని, విభజన చట్టంలోని అంశాలకు కట్టుబడి ఉంటామని చెప్పిన విషయం తెలిసిందే.
6403 కోట్లు, 2800 తోలి ఏడాది రెవెన్యూ లోటు, పోలవరం ప్రాజెక్టుసక నిధులు, విభజనచట్టంలోని అంశాలకు కట్టుబడి, ఏపీ ఆందోళన అవసరం లేదు, అడిగినదాని కంటే ఎక్కువ ఇచ్చాం, రెవెన్యూ లోటుపై అధ్యయనం చేస్తునాం, విభజించింది యూపీఏ.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications