వరద సమయంలోనూ ఇదేం దరిద్రం..విజయవాడలో మనిషికి రూ.5 వేలు వసూలు (వీడియో)
రాష్ట్రంలో వరదలు బీభత్సం సృష్టించాయి. రెండు, మూడు రోజులుగా కుండపోత వర్షం కురిసింది. దీంతో వాగులు, వంకలు పొంగాయి. చాలా ప్రాంతాల్లో వరద నీళ్లు ఇళ్లలోకి చేరాయి. వాగులు, వంకలు ఉప్పొంగి ఊళ్లపై విరుచుకుపడ్డాయి. పలుచోట్ల రోడ్లపై వాగులు ఉధృతంగా ప్రవహించాయి. రాష్ట్రం వ్యాప్తంగా చాలా ప్రాంతాలు వరద ముంపుకు గురయ్యారు. ఈ వరదల్లో ఇప్పటి వరకు 15 మంది మృతి చెందినట్లు అధికార వర్గాలు తెలిపారు.
మరో ముగ్గురు వరద నీటిలో గల్లంతయ్యారని పేర్కొన్నారు.ముఖ్యంగా విజయవాడ చరిత్రలో ఎప్పుడు చూడని వర్షం కురిసిందని అధికారులు చెబుతున్నారు. కృష్ణానది చరిత్రలోనే ఇలాంటి వరద ఉదృతిని ఎప్పుడు చూడలేదని విజయవాడ వాసులు చెబుతున్నారు. భారీ వర్షాల కారణంగా విజయవాడం మొత్తం కూడా జలమయంగా మారింది. విద్యాధరపురం, ఆర్ఆర్ నగర్, విజయవాడ సెంట్రల్ బస్ స్టాండ్, బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ ప్రాంతాల్లో రహదారులు జలమయం అయ్యాయి. రోడ్లపైకి భారీగా నీరు చేరడంతో ట్రాఫిక్కు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి.

పైపుల రోడ్డు, సింగ్ నగర్ వంటి ప్రాంతాలు పూర్తిగా జలమయంగా మారాయి.రెండు రోజులుగా ఆహారం కూడా అందక ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. శనివారం నుంచి భారీ వర్షాల కారణంగా ప్రజలు ఎన్నో అవస్థలు పడుతున్నారు. మరికొందరికి తాగడానికి నీరు కూడా దొరకని పరిస్థితి. ప్రభుత్వం అందిస్తోన్న సాయం అన్ని ప్రాంతాలకు చేరడం లేదు. అయితే ఇదే అదునుగా కొందరు దందాకు తెరలేపారు. విజయవాడలో లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
అయితే అవి ఏమాత్రం సరిపోకపోవడంతో దళారులు తమ దందాను మొదలుపెట్టారు. ప్రజల భయాన్ని తమ పెట్టుబడిగా మార్చుకున్నారు. జలదిగ్బదంలో ఉన్న ప్రజలను ఒడ్డుకు చేర్చినందుకు మనిషికి రూ. 5 వేల రూపాయిలు వసూలు చేస్తున్నారు.అటు ప్రజలు కూడా ప్రాణాలు కన్నా డబ్బులు ఎక్కువ కాదని ఆ డబ్బులు చెల్లించి ప్రాణాలతో సురక్షితంగా బయటపడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.
-
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications