ఏపీ బంద్: మద్దతుగా ప్లకార్డుతో జగన్, గుండుతో ఎమ్మెల్యే, నిరసనలో జనసేన, కాంగ్రెస్
Recommended Video

అమరావతి: కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు సరైన కేటాయింపులు చేయకపోవడాన్ని నిరసిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో గురువారం రాష్ట్ర బంద్ చేపట్టాయి. దీనికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, జనసేన, కాంగ్రెస్ పార్టీలు, వివిధ సంఘాలు మద్దతు ప్రకటించాయి.
గురువారం ఉదయం నుంచే వామపక్షాలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు దిగాయి. పలు ఆర్టీసీ డిపోల ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. కాగా, తిరుమలకు వెళ్లే బస్సులకు మాత్రం నిరసనకారులు మినహాయింపునిచ్చారు. గుంటూరు, విశాఖపట్నంలలో బంద్ సంపూర్ణంగా సాగుతోంది. విశాఖ ఏజెన్సీలో బుధవారం సాయంత్రం 6గంటల వరకు 144సెక్షన్ విధించారు.
#Krishna (AP): TDP MLA Bode Prasad gets head tonsured unhappy over the funds allocated to the state of Andhra Pradesh. pic.twitter.com/V7sPIrzA4p
— ANI (@ANI) February 8, 2018
- కేంద్రం వైఖరికి నిరసనగా గుండుగీయించుకుని ఆందోళనలో పాల్గొన్నారు పెనమలూరు ఎమ్మెల్యే ప్రసాద్.
నిరసనకారులు బస్సులను నిలిపివేయడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో పలు ప్రాంతాల్లో పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేశారు.
ప్లకార్డుతో జగన్

బంద్కు సంఘీభావంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ బుధవారం ప్రజాసంకల్పయాత్ర నిలిపివేశారు. ఆయన నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం ఏఎస్పేట మండలం దుండిగం క్రాస్ జోలగుంటపల్లి శివారు వద్ద బంద్లో పాల్గొన్నారు. విద్యార్థులతో కలిసి వైఎస్ జగన్ ప్లకార్డులు పట్టుకుని బంద్కు సంఘీభావం తెలిపారు.
విద్యా, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి. ప్రభుత్వం కూడా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది. టీడీపీ నేతలు కూడా రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి నిరసన శాంతియుత ర్యాలీలు చేపడుతున్నారు.
Visakhapatnam: Bandh called by Left parties in protest against #UnionBudget2018 #AndhraPradesh pic.twitter.com/LnZYfIJyMZ
— ANI (@ANI) February 8, 2018
కాగా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి కూడా గురువారం పాదయాత్రకు విరామం ప్రకటించారు. బడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని నిలదీస్తూ రాజకీయపక్షాలు తలపెట్టిన బంద్కు మద్దతిస్తున్నట్లు జనసేన అధ్యక్షుడు పవన్కళ్యాణ్ బుధవారమే ప్రకటించారు.
ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా శాంతియుతంగా పాల్గొనాలని కార్యకర్తలను ఆయన కోరారు. బంద్ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు. కాగా, బంద్ విషయమై బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు డీజీపీ మాలకొండయ్యతో సమావేశమయ్యారు.
పలు అంశాలతో పాటు బంద్ సందర్భంగా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలపై చర్చించారు. పోలీసులు కూడలి ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. నిరసనలు శాంతియుతంగా చేసుకోవాలని, ప్రజల ఆస్తులకు నష్టం కలిగించేలా వ్యవహరించకూడదని నిరసనకారులకు డీజీపీ స్పష్టం చేశారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications