శ్రీలక్ష్మి విచారణకు కేంద్రం అనుమతి, నోటీసులు జారీ

సిబిఐ కేసులతో శ్రీలక్ష్మి ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఓఎంసి, దాల్మియా చార్జిషీట్లలో ఆమెపై అభియోగాలను నాంపల్లి సిబిఐ కోర్టు ఇప్పటికే విచారిస్తోంది. జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి అవినీతి నిరోధక చట్టం (పిసి యాక్ట్)కింద కూడా శ్రీలక్ష్మిపై అభియోగాలున్నాయి.
వీటిపై విచారణకు కేంద్రం నుంచి అనుమతి పత్రాలు అందడంతో సిబిఐ అధికారులు వాటిని కోర్టులో దాఖలు చేశారు. వీటి పరిశీలన తర్వాత కేసును విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి బాలయోగి శుక్రవారం (21న) హాజరు కావాలంటూ శ్రీలక్ష్మికి సమన్లు జారీ చేశారు.
కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి అనురాగ్ శర్మ సిబిఐకి లేఖ రాశారు. దీంతో సిబిఐ ఆమెపై అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13(2) రెడ్ విత్ 13(1)సి)(డి)ల కింద మోపిన అభియోగాలను విచారణ కోసం పరిగణలోకి తీసుకోవాలంటూ సిబిఐ కోర్టులో మెమో దాఖలు చేసింది. దీనిని పరిగణలోకి తీసుకున్న సిబిఐ కోర్టు ఈ నెల 21న కోర్టుకు హాజరు కావాలని శ్రీలక్ష్మికి నోటీసులు జారీ చేసింది.
ఇక రాంకీ సంస్థకు భూముల కేటాయింపు కేసులో ఆరోపణలున్న ఐఏఎస్ వెంకట్రామిరెడ్డిపైనా పిసి యాక్ట్ కింద విచారణకు ఇటీవలే అనుమతి వచ్చిన నేపథ్యంలో దీన్ని కోర్టు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది.
-
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications