తిరుపతిలో క్లైమాక్స్ లో మామలు ఎంట్రీ, వీపు, ముడ్డి రెండు పగిలిపోయాయి. దొంగఓటు కాదు!
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓట్లు వెయ్యడానికి ప్రజలు పోటీ పడ్డారు. బయట రాష్ట్రాల్లో నివాసం ఉంటున్న లక్షలాది మంది ప్రజలు ఆంధ్రప్రదేశ్ లోని వారి సొంత ప్రాంతాలకు చేరుకుని ఓట్లు వేశారు. పండగలు, శుభకార్యాలకు కూడా సొంత ఊర్లకు రాని ప్రజలు కూడా ఈసారి సొంత ఊర్లకు చేరుకుని ఓటు వేశారు.
రెండు మూడు రోజుల ముందే సొంత ప్రాంతాలకు వచ్చిన ప్రజలు అసెంబ్లీ అభ్యర్థులు, లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారి అభిమాన నాయకులకు ఓటు వేశారు. పలు ప్రాంతాల్లో దొంగ ఓట్లు వెయ్యడానికి కొందరు ప్రయత్నించారని ఆరోపణలు ఉన్నాయి. మెజారిటీ కోసం, ఓడిపోతాం అనే భయం ఉన్న నాయకులు కొందరు ఇతర ప్రాంతాల నుంచి వారు పోటీ చేస్తున్న నియోజక వర్గాలకు పిలిపించుకుని దొంగ ఓట్లు వెయ్యడానికి ప్రయత్నించారని ఆరోపణలు ఉన్నాయి.

మాజీ సీఎం చంద్రబాబు పోటీ చేస్తున్న కుప్పం నియోజక వర్గంలో దొంగ ఓట్లు వెయ్యడానికి అనేక ప్రయత్నాలు చేశారని స్థానిక టీడీపీ నాయకులు ఆరోపించారు. ఏడు కొండల స్వామి కొలువు తీరిన తిరుమల కొండ కింద ఉన్న తిరుపతి నగరంలో వైసీపీ నాయకులు ఇతర ప్రాంతాల నుంచి చాలా మందిని పిలిపించి దొంగ ఓట్లు వేయించడానికి ప్రయత్నించారని జనసేన, బీజేపీ నాయకులు ఆరోపించారు.
తిరుపతిలోని 13వ వార్డులోని పోలింగ్ బూత్ నెంబర్లు 141, 142, 143 ల్లో దొంగ ఓట్లు వెయ్యడానికి ప్రయత్నించిన కొందరిని బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. పదేపదే గొంగ ఓట్లు వెయ్యడానికి కొందరు రావడంతో ఆ బూత్ ల్లో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. తరవాత సుమారు 50 మంది వైసీపీ కార్యకర్తలు, నాయకులు కత్తులు, కర్రలు తీసుకు వచ్చి మమ్మల్ని బెదిరించి తమ మీద దాడి చేశారని బీజేపీ, జనసేన నాయకులు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు.

విషయం తెలుసుకున్న టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు కిరణ్ రాయల్, రాజారెడ్డి తదితరులు సంఘటనా స్థలానికి చేరుకుని వైసీపీ నాయకుల తీరుతో నిరసన వ్యక్తం చేశారు. స్థానిక పోలీసులు వైసీపీ నాయకులకు అమ్ముడుపోయి దొంగ ఓట్లు వెయ్యడానికి వచ్చిన వారిని పట్టుకోకుండా చూసిచూడనట్లు వదిలేశారని, వెంటనే కేంద్ర బలగాలను రప్పించాలని కూటమి నేతలు నిరసన వ్యక్తం చేశారు.
సమాచారం తెలుసుకున్న ఎన్నికల అధికారులు కేంద్ర బలగాలను రంగంలోకి దింపారు, మరోసారి దొంగ ఓట్లు వెయ్యడానికి వచ్చిన కొందరిని కేంద్ర బలగాలు పట్టుకున్నారు. దొంగ ఓట్లు వెయ్యడానికి వచ్చిన ఇద్దరిని రోడ్డు మీద మోకాళ్ల మీద కుర్చోబెట్టి లాఠీలతో వీపు, ముడ్డి పగిలిపోయేలా బడితపూజ చేశారు. దొంగ ఓట్లు వెయ్యడానికి వచ్చిని వారిని అదుపులోకి తీసుకున్న కేంద్ర బలగాలు వారిని ఎన్నికల అధికారులకు అప్పగించారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!












Click it and Unblock the Notifications