పోలవరం ప్రాజెక్టు ఇప్పట్లో లేనట్లే ? పార్లమెంట్ లో కేంద్రం షాకింగ్ ప్రకటన..!

ఏపీకి జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం షాకింగ్ న్యూస్ చెప్పింది. పదేళ్ల క్రితం జాతీయ హోదా ఇచ్చి తామే నిర్మాణం చేసి ఇస్తామని ప్రకటించిన పోలవరం ప్రాజెక్ట్ ఇప్పటివరకూ కొలిక్కిరాలేదు. ఐదేళ్లుగా సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లి ప్రధాని, కేంద్రమంత్రుల్ని కలుస్తున్నా ఫలితం మాత్రం లేదు. ఈ క్రమంలో ప్రాజెక్టులో సాంకేతిక లోపాలు కూడా తలెత్తాయి. వీటిని ఎలా సరిదిద్దాలో తెలియక తలలు పట్టుకుంటున్న వేళ.. కేంద్రం మరో షాక్ ఇచ్చింది.

పోలవరం ప్రాజెక్టు తొలిదశ నిర్మాణం పూర్తికి 2026 మార్చి నెలను తాజా గడువుగా నిర్ణయించింది. అంటే 2026కి కేవలం తొలి దశ పూర్తి కావాలని లక్ష్యంగా పెట్టుకుందన్న మాట. ఇక మిగతా దశల మాట దేవుడెరుగు. ఈ మేరకు కేంద్ర జల్ శక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు పార్లమెంట్లో ప్రకటన చేశారు. విభజన చట్టం ప్రకారం పదేళ్లలో పూర్తి కావాల్సిన ప్రాజెక్టుకు ఇంకా తొలి దశ పూర్తి కావడానికి మరో రెండేళ్ల గడువు పెట్టిందంటే దీనిపై కేంద్రం నిర్లక్ష్యం ఏంటో అర్ధమవుతోంది. అయినా రాష్ట్రం నుంచి గట్టిగా పోరాడలేని పరిస్ధితి నెలకొంది.

centre clarified polavaram first phase only completed by march 2026
పోలవరం ప్రాజెక్టు తొలి దశ పూర్తి అంటే 41.15 మీటర్ల ఎత్తుకు నిర్మాణం మాత్రమే 2026 మార్చి నాటికి పూర్తవుతుందని తాజా అంచనా వేశారు. ఈ మధ్యలో నిధుల కేటాయింపులో ఆలస్యం, ఇతరత్రా కారణాలు తలెత్తితే ఆ గడువు మరింత పెరిగినా ఆశ్చర్యం లేదు. అసలే పోలవరం ప్రాజెక్టుకు తాము ముందుగా నిధులు ఇవ్వబోమని, కేవలం ఖర్చు పెట్టిన నిధులకు రీయింబర్స్ మెంట్ మాత్రమే చేస్తామని తాజాగా కేంద్రం తేల్చేసింది. ఈ లెక్కన రాష్ట్ర ప్రభుత్వం తమ సొంత నిధుల్ని పెట్టుబడిగా పెట్టి దీన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+