ఏపీ హైవేలపై ఇక..!!
అటవీ మార్గాల గుండా సాగే జాతీయ రహదారులపై తరచూ వన్యప్రాణులు ప్రమాదాలకు గురవుతుంటాయి. జింకలు, దప్పులు, ఎలుగుబంట్లు, పులులు.. ఇలా అనూహ్యంగా రోడ్డు మీదికి రావడం, వాహనాల కింద పడి ప్రాణాలు వదలటమో లేక తీవ్రంగా గాయపడటమో మనం తరచూ చూస్తుంటాం. ఇటువంటి సంఘటనలు జరక్కుండా వన్యప్రాణులు రోడ్డు దాటే పాయింట్ల వద్ద ప్రత్యేకంగా బోర్డులు పెట్టినప్పటికీ పెద్దగా ఉపయోగం ఉండట్లేదు.
ఈ పరిస్థితులను నివారించడానికి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఓ వినూత్న విధానాన్ని ప్రవేశపెట్టింది. జాతీయ రహదారుల మీద ఎరుపు రంగులో ఉండే టేబుల్టాప్ లను ఏర్పాటు చేసింది. అయిదు మిల్లీమీటర్ల మందంతో ఉండే టేబుల్ టాప్ లు ఇవి. రోడ్డు ఉపరితలం నుంచి కొద్దిగా ఎత్తులో ఉంటాయి. వాహనదారులకు స్పష్టంగా కనిపిస్తాయి కూడా. వాహనాలు దీనిపై వెళ్ళినప్పుడు తేలికపాటి కుదుపును సృష్టిస్తాయి ఇవి. దీంతో- డ్రైవర్లు ఆటోమేటిక్ గా వాహన వేగాన్ని తగ్గిస్తారు.

ఫలితంగా ఏదైనా వన్యప్రాణి హఠాత్తుగా రోడ్డు మీదికి వచ్చినా సడన్ గా బ్రేకులు వేయడానికి లేదా వేగాన్ని నియంత్రించడానికి ఇది ఉపకరిస్తుంది. జంతువులు సురక్షితంగా రోడ్డు దాటడానికి వీలవుతుంది. అంతేకాకుండా, డ్రైవర్లలో పరిసరాల పట్ల అవగాహన కూడా పెరుగుతుంది. ప్రస్తుతం ఈ విధానం మధ్యప్రదేశ్ లో అమలులోకి వచ్చింది. జబల్పూర్- భోపాల్ జాతీయ రహదారిపై ఈ టేబుల్ టాప్ లు అందుబాటులోకి వచ్చాయి.
వీరాంగన దుర్గావతి టైగర్ రిజర్వ్, నౌరాదేహి వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల గుండా వెళ్తుందీ రోడ్డు. అత్యంత రద్దీగా ఉండే జాతీయ రహదారుల్లో ఇదీ ఒకటి. అలాగే- వన్యప్రాణుల సంఖ్య ఇక్కడ ఎక్కువ. జింకలు, నీల్గాయ్, నక్కలు వంటి జంతువులు ఈ రోడ్డును దాటే క్రమంలో ప్రమాదాలకు గురయ్యేవి. వన్య ప్రాణులకు అత్యంత ప్రమాదకరమైన జోన్.
विकास के साथ पर्यावरण का संतुलन!
— Nitin Gadkari (@nitin_gadkari) December 16, 2025
वन्यजीवों की सुरक्षा को ध्यान में रखकर 🇮🇳 भारत में पहली बार 🛣️ राजमार्ग पर 5 मिमी की रेड टेबल-टॉप ब्लॉक मार्किंग का प्रयोग!
मध्य प्रदेश के नौरादेही वन्यजीव अभयारण्य क्षेत्र में राष्ट्रीय राजमार्ग-45 जबलपुर-भोपाल मार्ग पर 11.96 किमी 2 और 4 लेन… pic.twitter.com/L1DP5Y3dAg
దీంతో తొలి దశలో ఈ మార్గంలోనే ఈ టేబుల్ టాప్ వ్యవస్థను ప్రవేశపెట్టింది జాతీయ రహదారుల సంస్థ. అటవీ జంతువులు ఎక్కువగా రోడ్డు దాటే పాయింట్లను గుర్తించింది. ఈ రహదారిపై 12 కిలోమీటర్ల వరకు టేబుల్ టాప్ వేసింది. దీంతో పాటు NH 25 అండర్పాస్లను కూడా నిర్మించింది. ఇది విజయవంతమౌతోన్న క్రమంలో దేశవ్యాప్తంగా అటువంటి పాయింట్లను గుర్తించి దశలవారీగా వీటిని ఏర్పాటు చేయనుంది.
దీనిపై తాజాగా ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఓ వీడియోను ట్వీట్ చేశారు. భోపాల్- జబల్ పూర్ మధ్య తొలిసారిగా ఇటువంటి రోడ్డు నిర్మాణం చేపట్టడం వల్ల సత్ఫలితాలు వస్తోన్నాయని వెల్లడించారు. గతంతో పోల్చుకుంటే వన్యప్రాణుల రోడ్డు ప్రమాదాలకు గురయ్యే సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోందని అన్నారు. క్రమంగా దీన్ని అన్ని రాష్ట్రాలకు విస్తరిస్తామని తెలిపారు. టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ గుండా వెళ్లే జాతీయ రహదారులను గురిస్తోన్నామని చెప్పారు.
ఏపీ, తెలంగాణల్లో ఇటువంటి రెడ్ రోడ్లు రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఏపీ- తెలంగాణ, ఏపీ- ఒడిశా, ఏపీ- ఛత్తీస్ గఢ్, తెలంగాణ- మహారాష్ట్రను అనుసంధానించే జాతీయ రహదారులు కూడా వ్యూహాత్మక అటవీ ప్రాంతాల గుండా వెళ్తుంటాయి. శ్రీశైలం టైగర్ రిజర్వ్, కవ్వల్ పులుల సంరక్షణ కేంద్రం వంటి ప్రాంతాలు ఇందుకు ఉదాహరణ. దశలవారీగా ఆయా మార్గాల్లో ఈ తరహా వ్యవస్థను ఏర్పాటు చేసే అవకాశాలు లేకపోలేదు.
-
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు!












Click it and Unblock the Notifications