అమెరికాకు చంద్రబాబు - అసలు కారణం..!!
ఏపీలో ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. గెలుపు పైన ప్రధాన పార్టీలు ధీమాగా ఉన్నాయి. లోలోపల మాత్రం ఆందోళన కనిపిస్తోంది. ఎవరు గెలుస్తారనేది పెద్ద ఎత్తున బెట్టింగ్స్ జరుగుతున్నాయి. సీఎం జగన్ కుటుంబ సభ్యులతో విదేశీ పర్యటనకు వెళ్లారు. టీడీపీ అధినేత చంద్రబాబు అమెరికా వెళ్లారు.అయిదు రోజులు తరువాత తిరిగి రానున్నారు. అయితే, ఎన్నికల ఫలితాల అంచనాల పైన టీడీపీ ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు.
తెలుగు దేశం అధినేత చంద్రబాబు శనివారం అర్ధరాత్రి హైదరాబాద్ నుంచి అమెరికా బయలుదేరి వెళ్లారు. ఆయనతో పాటు సతీమణి భువనేశ్వరి కూడా చంద్రబాబు వెంట ఉన్నారు. లోకేశ్ కొద్దిరోజుల క్రితం కుటుంబంతో కలసి అమెరికా వెళ్లారు. చంద్రబాబు వైద్య పరీక్షల నిమిత్తం ఆయన అమెరికా వెళ్లినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయన గతంలో కూడా ఒకసారి అమెరికాలో మెడికల్ టెస్టులు చేయించుకున్నారు. ఇప్పుడు మరోసారి వైద్య పరీక్షల కోసం వెళ్లారు. ఐదారు రోజుల్లో ఆయన తిరిగి రానున్నారు.

ఏపీలో ఎన్నికలు పూర్తయిన తరువాత టీడీపీ కూటమి నేతలు గెలుపు పైన భారీ అంచనాలతో ఉన్నారు. అయితే, అధికారికంగా టీడీపీ ముఖ్య నేతలు తాము గెలిచే సీట్ల సంఖ్య...గెలుపు గురించి ఎక్కడా స్పందించలేదు. జగన్ ఐ ప్యాక్ టీంతో సమావేశమైన సమయంలో 2019 లో వచ్చిన 151 సీట్ల కంటే ఎక్కువ స్థానాలు సాధిస్తామని చెప్పారు.
జగన్ వ్యాఖ్యలు పూర్తి నమ్మకంతో చెప్పారా..పార్టీ కేడర్ లో విశ్వాసం పెంచేందుకు చెప్పారా అనే చర్చ నడుస్తోంది. టీడీపీ అధినాయకత్వం జగన్ వ్యాఖ్యల పైన ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. దీంతో..ఎన్నికల ఫలితాల పైన మరింత ఉత్కంఠ పెరుగుతోంది. రెండు పార్టీల నుంచి గెలుపు పైన విశ్వాసం ఉన్నా..అసలు విజేత ఎవరనేది జూన్ 4న తేలనుంది.
-
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!!












Click it and Unblock the Notifications