సీమాంధ్ర: హావభావాలు మారుస్తూ బాబు (పిక్చర్స్)
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రెండు ప్రాంతాల నాయకులకు మార్గనిర్దేశం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర విభజన ఖాయం కావడంతో ఆయన తెలంగాణ, సీమాంధ్ర నేతలను వచ్చే ఎన్నికలకు సమాయత్తం చేసే పనికి పూనుకున్నారు. తెలంగాణ నేతలను ఉద్దేశించి ఇప్పటికే ప్రసంగించిన చంద్రబాబు నాయుడు సోమవారం సీమాంధ్ర నాయకులతో సమావేశమయ్యారు.
కాంగ్రెసు పార్టీ ఎదుర్కోవడానికే ఆయన సిద్ధపడ్డారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్, కిరణ్ కుమార్ రెడ్డిపైనే కాకుండా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై కూడా ఆయన సోమవారం విమర్సలు చేశారు.
రెండు ప్రాంతాల్లోనూ తమ పార్టీ బలంగా ఉందని చెప్పారు. తెలంగాణలో, సీమాంధ్రలో కూడా తమ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పారు. సమావేశంలో ప్రసంగిస్తున్నప్పుడు ఆయన తన హావభావాలను, ముఖకవళికలను ప్రదర్శించే ప్రయత్నం చేశారు.
నేతల నమస్కారాలు స్వీకరిస్తూ..
సీమాంధ్ర నేతల విస్తృత స్థాయి సమావేశంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నాయకుల నమస్కారాలను స్వీకరిస్తూ ఇలా..
నమస్కారం చేస్తూ..
పార్టీ సీమాంధ్ర నేతల సమావేశంలో నాయకులకు నమస్కారం చేస్తూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇలా కనిపించారు. ఇంతకు ముందు ఆయన విక్టరీ సింబల్ చూపించేవారు.
మహిళా నేతల నుంచి పుష్పగుచ్ఛం స్వీకరిస్తూ..
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి పుష్పగుచ్ఛం సమర్పిస్తూ మహిళా నేతలు ఇలా..
బాబుతో బుచ్చయ్య చౌదరి..
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితో పార్టీ కృష్ణా జిల్లా నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ ఇలా కనిపించారు.
మార్గనిర్దేశం చేస్తూ ఇలా..
సీమాంధ్ర నాయకులకు మార్గనిర్దేశం చేస్తూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కాంగ్రెసుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్ను నేనే అభివృద్ధి చేశా..
సీమాంధ్ర నేతల సమావేశంలోనూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హైదరాబాదును, తెలంగాణను తానే అభివృద్ధి చేశానని చెప్పారు.