వైసీపీలా కాకుండా ఉండాలంటే.. ఏం చేయాలో ఎమ్మెల్యేలకు చెప్పిన చంద్రబాబు...!
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో చేసిన తప్పిదాలను మీరు పునరావృతం చేయొద్దంటూ సీఎం చంద్రబాబు ఇవాళ ఎన్డీఏ ఎమ్మెల్యేలకు సూచించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వేళ ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించేందుకు నిర్వహించిన సమావేశంలో ఆయన కీలక ప్రసంగం చేశారు. ఇందులో ప్రధానంగా అసెంబ్లీలో సభ్యుల ప్రవర్తన, బడ్జెట్ పై అవగాహన తెచ్చుకోవడం వంటి అంశాలపై పలు సూచనలు చేశారు.
ఇందులో గత ఐదేళ్ల కాలంలో అసెంబ్లీలో దూషణలకు దిగడం ద్వారా వైసీపీ ఎమ్మెల్యేలు ఎలా పలుచన అయ్యారో చంద్రబాబు ఎమ్మెల్యేలకు వివరించారు. ముఖ్యంగా అసెంబ్లీలో తమ ప్రజాప్రతినిధి ఏం మాట్లాడుతున్నారనే దానిపై ప్రజలు నిత్యం గమనిస్తూనే ఉంటారన్నారు. అందులో బూతులు మాట్లాడితే మాత్రం ప్రజలు స్వాగతించరని గుర్తుచేశారు. గతంలో ఇదే జరిగిందంటూ గత ఎన్నికల్లో వైసీపీ ఓటమిని పరోక్షంగా ప్రస్తావించారు.

అలాగే శాసనసభలో ప్రతిపక్షం లేదు కదా, మనకేం ఫర్వాలేదని అనుకోవద్దని సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేలకు మరో కీలక సూచన చేశారు. వాళ్లకు ఎలాగో బాధ్యత లేదని, కానీ మనం మాత్రం ప్రజలకు జవాబుదారీతనంతో పనిచేద్దామని ఎమ్మెల్యేలకు ఆయన సూచించారు. ప్రజలకు ఏం అవసరమో చెప్పడానికి, అలాగే మనం చేసింది చెప్పడానికి అసెంబ్లీ ఓ వేదిక లాంటిదని ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి గుర్తుచేశారు. బడ్జెట్ తో పాటు ప్రభుత్వం తెచ్చే బిల్లులు, పాలసీలపై ఎమ్మెల్యేలు తప్పకుండా అధ్యయనం చేయాలని సూచించారు.
-
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications