మళ్లీ ఉల్లికి కష్టాలు- రైతుల గగ్గోలు- చంద్రబాబు కీలక ఆదేశాలు..!
ఏపీలో భారీ వర్షాలు ఉల్లి పంటకు శాపంగా మారుతున్నాయి. ఓవైపు డిమాండ్ కు తగినంతగా ఉల్లిపాయలు లేకుండా పోతుంటే.. మరోవైపు ఉల్లికి కనీస మద్దతు ధర లేకపోవడంతో రైతులు రోడ్డెక్కే పరిస్ధితులు కనిపిస్తున్నాయి. కనీస మద్దతు ధర కోరుతూ ఇవాళ ఉల్లి రైతులు కర్నూలు మార్కెట్ యార్డ్ లో ఆందోళన తెలిపారు. దీనిపై వైసీపీ నేతలు కూడా మద్దతు పలికారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు స్పందించారు.
రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. అలాగే ఏపీకి ప్రధానంగా ఉల్లి సరఫరా జరిగే మహారాష్ట్ర సహా ఇతర ఉత్తరాది రాష్ట్రాల్లోనూ వర్షాలు, వరదలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీకి రావాల్సిన ఉల్లిపాయలు రావడం లేదు. అదే సమయంలో రైతులకు తగిన మద్దతు ధర కూడా రావడం లేదు. ఈ నేపథ్యంలో ఇవాళ కర్నూలు మార్కెట్ యార్డును సందర్శించిన వైసీపీ నేతలు ఎస్వీ మోహన్ రెడ్డి, రైతు విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వంగాల భరత్ కుమార్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి తెర్నేకల్లు సురేందర్ రెడ్డి రైతులకు ధైర్యం చెప్పారు.

కర్నూలు వ్యవసాయ మార్కెట్లో ఉల్లి రైతులు ఆందోళన చేపట్టారు. తమక కనీస మద్దతు ధర కల్పించాలని కోరుతూ నిరసన చేపట్టారు. ఉల్లికి సరైన గిట్టుబాట ధర లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్కు తెచ్చిన ఉల్లిని క్వింటాకు రూ. 200 నుండి రూ. 400 వరకూ మాత్రమే వ్యాపారులు కొనుగోలు చేస్తుండటంపై రైతులు ఆందోళనకు దిగారు. తమ ఉల్లి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. పెట్టిన పెట్టుబడికి మద్దతు ధర లేక అప్పులు పాలు అవుతున్నామని రైతులు వాపోతున్నారు. కనీస మద్దతు ధర రూ. 2 వేలు కల్పించాలని కోరుతున్నారు.
ప్రతి ఏడాది క్వింటాలు రూ. 3000 నుంచి రూ.5000 వరకు ధర వచ్చేవని, సరుకు పూర్తిగా పాడైనా కనీసం క్వింటాలుకు రూ. 1800 నుంచి రూ. 2000 పలికాయని వైసీపీ నేత ఎస్వీ మోహన్ రెడ్డి గుర్తుచేశారు. ఈ ఏడాది మాత్రం క్వింటాలు రూ.100 కు కూడా అడిగే పరిస్ధితులు లేవని రైతులు లబోదిబోమంటున్నారన్నారు. దీనిపై ఇవాళ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రైతుల నుంచి ఉల్లి క్వింటాల్ రూ.1,200లకు కొనుగోలు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

ఉల్లి పంటను కొనుగోలు చేసి నిల్వ చేయాలని సీఎం ఆదేశించారు. 5వేల మెట్రిక్ టన్నుల ఉల్లి పంట వస్తుందని అధికారులు సీఎంకు తెలిపారు. దీంతో ఉల్లిని రైతు బజార్లలో విక్రయించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని పంటల ధరల స్థిరీకరణ కోసం వేర్ హౌసింగ్ సదుపాయం కల్పించాలన్నారు. ఉల్లి రైతులకు నష్టం రాకుండా అధికారులు చూడాలన్నారు.
-
జగన్ సన్నిహిత అధికారితో రహస్య భేటీ, ప్రభుత్వం సీరియస్- ఐఏఎస్ పై వేటు..!! -
ఏపీలో గ్యాస్ కొరతపై మంత్రి నాదెండ్ల మనోహర్ క్లారిటీ -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!!












Click it and Unblock the Notifications