ఢిల్లీకి చంద్రబాబు- బెంగళూరుకు జగన్ పయనం..! కారణాలివే..
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ మధ్యాహ్నం ఒకరి తర్వాత మరొకరు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరి ఇతర రాష్ట్రాలకు వెళ్లారు. సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన కోసం బయలుదేరి వెళ్లగా.. మాజీ సీఎం వైఎస్ జగన్ మరోసారి బెంగళూరుకు బయలుదేరారు. దీంతో గన్నవరం ఎయిర్ పోర్టు సందడిగా మారింది. వీరితో పాటు అసెంబ్లీ సమావేశాలు ముగించుకుని పలువురు మంత్రులు కూడా విమానాల్లో బయలుదేరారు.
సీఎం చంద్రబాబు రేపు ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ భేటీలో పాల్గొనేందుకు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్లారు. కాసేపట్లో ఢిల్లీ చేరుకుని అక్కడే అధికారిక నివాసం వన్ జన్ పథ్ తో విశ్రాంతి తీసుకుని కేంద్రమంత్రుల్ని కలవడంతో పాటు నీతి ఆయోగ్ భేటీకి హాజరవుతారు. పోలవరం, అమరావతి ప్రాజెక్టుల్ని వికసిత్ భారత్ లక్ష్యంలో భాగంగా పూర్తి చేసేలా నీతి ఆయోగ్ ముందు చంద్రబాబు ప్రతిపాదనలు పెడతారు. ఇప్పటికే నీతి ఆయోగ్ అధికారులు ఏపీకి వచ్చి వీటిపై చర్చించి వెళ్లారు.

మరోవైపు మాజీ సీఎం వైఎస్ జగన్ మరోసారి బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు. ఈసారి కూడా ఆయన సతీమణి భారతీ సమేతంగా పయనమయ్యారు. ఇవాళ ప్రెస్ మీట్ నిర్వహించిన జగన్ అనంతరం గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో బెంగళూరు వెళ్లిపోయారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఇప్పటికే రెండుసార్లు బెంగళూరు వెళ్లి అక్కడి యలహంస ప్యాలెస్ లో విశ్రాంతి తీసుకుని వచ్చిన జగన్.. ఇప్పుడు మూడోసారి బయలుదేరి వెళ్లారు. రాష్ట్రంలో పరిణామాలను బట్టి ఆయన తిరిగి వచ్చే షెడ్యూల్ ఖరారు కానుంది.
-
మార్కాపురం బస్సు ప్రమాదం..సీఎం చంద్రబాబు,లోకేష్ తో పాటు మంత్రుల దిగ్భ్రాంతి -
వైసీపీ జోలికెళ్లను, జగన్ టార్గెట్ కాదు-రూటుమార్చిన షర్మిల..! -
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
త్వరలోనే జగన్ పాదయాత్ర.. చంద్రబాబుకు రోజుకో సినిమా చూపిస్తారట! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..!












Click it and Unblock the Notifications