వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అందరికీ 'కొంత' నగదు, మిగతా డిజిటల్: సామాన్యుడికి బాబు ఊరట మాట, జైట్లీ వరాలపై..

నోట్ల రద్దు తర్వాత నెల రోజులకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించిన వరాల పైన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గురువారం స్పందించారు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: నోట్ల రద్దు తర్వాత నెల రోజులకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించిన వరాల పైన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గురువారం స్పందించారు. నగదు రహిత (క్యాష్ లెస్) లావాదేవీలకు జైట్లీ ప్రోత్సాహకాలు ప్రకటించారని చెప్పారు.

'మోడీ రైట్' అంటారు, మన్మోహన్ నుంచి ఈ దారుణ పదాలు''మోడీ రైట్' అంటారు, మన్మోహన్ నుంచి ఈ దారుణ పదాలు'

నగదు రహిత లావాదేవీలకు బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. నీతి అయోగ్ భేటీ జరిగింది. దీనిపై చంద్రబాబు మాట్లాడుతూ.. ఆధార్ రహిత లావాదేవీల పైన చర్చించినట్లు తెలిపారు. నగదు రహిత లావాదేవీలపై చంద్రబాబు అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ తొలి సమావేశం ఇవాళ ఢిల్లీలో జరిగింది.

chandrababu naidu

సమావేశంలో ఆర్బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌, నీతి ఆయోగ్‌ వైస్‌ ఛైర్మన్‌ పనగారియా, వివిధ బ్యాంకుల సీఎండీలు పాల్గొన్నారు. సమావేశం అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. పీవోఎస్‌ యంత్రాలు, కార్డుల ద్వారా డిజిటల్‌ లావాదేవీలు ప్రోత్సహిస్తున్నామన్నారు.

ప్రతి వినియోగదారుడికి కొంత నగదు అవసరమని, కనీస నగదు మినహా మిగతా వ్యవహారాలన్నీ డిజిటల్‌ విధానంలోనే జరగాలన్నారు. డిజిటల్‌ లావాదేవీల విధివిధానాలపై చర్చించినట్లు చెప్పారు. నగదు రహిత లావాదేవీలకు జైట్లీ ప్రకటించిన ప్రోత్సాహకాలు ఉపయోగపడతాయన్నారు.

ఆధార్‌ ఆధారిత లావాదేవీలపై చర్చించామని పనగారియా అన్నారు. ఆండ్రాయిడ్‌ ఫోన్లతో లావాదేవీలు నిర్వహించవచ్చని, క్యూఆర్‌ కోడ్‌ విధానం అమలు చేయాలని బ్యాంకులను కోరామన్నారు. మైక్రో ఏటీఎంలను పెంచాలని ఆర్బీఐకి సూచించామన్నారు. డిజిటల్‌ లావాదేవీలపై విస్తృత ప్రచారం చేయాలన్నారు.

నోట్ల రద్దు: నెల తర్వాత ఎన్నో వరాలు ప్రకటించిన అరుణ్ జైట్లీ, ఇవే...నోట్ల రద్దు: నెల తర్వాత ఎన్నో వరాలు ప్రకటించిన అరుణ్ జైట్లీ, ఇవే...

జైట్లీతో కేసీఆర్ భేటీ

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీతో భేటీ అయ్యారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు, పెద్దనోట్ల రద్దు అంశాలపై చర్చించారని తెలుస్తోంది. కేసీఆర్‌తో పాటు పలువురు ఎంపీలు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. జైట్లీతో కేసీఆర్ అరగంట పాటు భేటీ అయ్యారు.

English summary
Chandrababu-led panel on demonetisation hold maiden meeting today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X