పిలిచారు కదా అని, రచ్చ చేస్తామంటే అంగీకరిస్తామా?: రోజాపై బాబు ఆగ్రహం
ఏపీలో జరిగిన జాతీయ మహిళా పార్లమెంటు సదస్సుకు వైసిపి ఎమ్మెల్యే రోజాను ఆహ్వానించి అరెస్ట్ చేశారన్న ఆరోపణల పైన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సోమవారం నాడు తీవ్రంగా స్పందించారు.
అమరావతి: ఏపీలో జరిగిన జాతీయ మహిళా పార్లమెంటు సదస్సుకు వైసిపి ఎమ్మెల్యే రోజాను ఆహ్వానించి అరెస్ట్ చేశారన్న ఆరోపణల పైన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సోమవారం నాడు తీవ్రంగా స్పందించారు.
ఆహ్వానం ఉందని, మహిళా సదస్సుకు వచ్చి రచ్చ చేస్తామంటే పోలీసులు అంగీకరిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కులమతాలు రెచ్చగొట్టే వారి పట్ల కఠినంగా ఉంటామన్నారు. ప్రతి వారం కోర్టుకు వెళ్లేవారు సుద్దులు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. స్పీకర్ మహిళల పైన చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారన్నారు.
అమరావతిలో మహిళా పార్లమెంటు సదస్సు నిర్వహించడం సంతోషంగా ఉందని చెప్పారు. దేశంలో ఈ తరహా సదస్సు నిర్వహణ ఇదే తొలిసారి అని చెప్పారు. తరతరాలుగా వస్తున్న లింగ వివక్షను రూపుమాపేందుకు, మూడు రోజుల సదస్సులో విశ్వాసం కల్పించామన్నారు.
మహిళల సమస్యలన్నింటికి పరిష్కార ంచెప్పే దిశగా జాతీయ మహిళా పార్లమెంటు నిర్వహించామన్నారు. సోషల్ మీడియాలో సదస్సుకు మంచి స్పందన వచ్చిందని, మహిళా పార్లమెంటు ఎంతో సంతృప్తిని ఇచ్చిందన్నారు.

ప్రతి వ్యక్తి తోబుట్టువులను, భార్యను గౌరవించాలన్నారు. ఇకపై ప్రతి ఏడాది మహిళా పార్లమెంటును నిర్వహించేందుకు వేరే రాష్ట్రాలు ముందుకు రాకపోతే మళ్లీ అమరావతిలోనే నిర్వహిస్తామన్నారు.
రాష్ట్రంలో నాలుగు అతిపెద్ద ఈవెట్లు నిర్వహించామని, రెండు పుష్కరాలు నిర్వహించామన్నారు. ఇంటలెక్చువల్స్, విదేశీ ప్రముఖులు వచ్చారన్నారు. వటన్నింటికంటే తనకు ఎక్కువ సంతృప్తిని ఇచ్చింది మహిళా సదస్సే అన్నారు.
సోషల్ మీడియాలో కూడా ఈ సదస్సుకు మంచి స్పందన వచ్చిందని చెప్పారు. మహిళలకు ఇప్పటికీ సముచిత స్థానం దక్కడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మహిళళ భాగస్వామ్యం లేకపోతే అభివృద్ధి సాధ్యం కాదన్నారు. ఊహించినదాని కంటే ఎక్కువగా మహిళలు వచ్చారన్నారు. పదివేల మంది వస్తారనుకుంటే 22వేల మంది వచ్చారన్నారు.
-
కుటుంబ సమేతంగా తిరుమలకు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. -
త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్న తెలుగు హీరోయిన్.. వైజాగ్లో సందడి !! -
అవార్డుల గురించి చంద్రబాబుకు పాఠాలు చెప్పిన చిరంజీవి... విన్నారా? -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం









Click it and Unblock the Notifications