ఎమ్మెల్యేను చంపడం కోసం అబద్దం!: మావోయిస్టులపై బాబు, కొడుక్కి గ్రూప్ 1 జాబ్
అరకు: ఇటీవల మావోయిస్టుల ఘాతుకానికి ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర రావు, మాజీ ఎమ్మెల్యే శివేరు సోమ బలైన విషయం తెలిసిందే. వారి కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం పరామర్శించారు.
కిడారి సర్వేశ్వర రావు కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడారు. సమర్థుడైన నాయకుడు సర్వేశ్వర రావును కోల్పోయామన్నారు. అతని చిన్న కొడుక్కి గ్రూప్ వన్ ఉద్యోగం, విశాఖపట్నంలో ఇంటి స్థలం ఇస్తామని చెప్పారు. నలుగురు కుటుంబ సభ్యులకు పార్టీ తరఫున రూ.20 లక్షలు ఇస్తామని చెప్పారు.

సర్వేశ్వర రావు కుటుంబానికి రూ.ఒక కోటి ఆర్థిక సాయం చేస్తామని తెలిపారు. మావోయిస్టులు మైనింగ్కు వ్యతిరేకంగా హత్యలు చేశారని చెప్పడాన్ని ఆయన ఖండించారు. బాక్సైట్ మైనింగ్కు అనుమతులు ఎప్పుడో రద్దు చేశామని చెప్పారు. మైనింగ్ అనుమతుల రద్దు సంగతి పాడేరు బహిరంగ సభలోనే చెప్పానని అన్నారు.
మైనింగ్ చేస్తున్నారని చెప్పి హత్యలు చేయడం కేవలం సాకు మాత్రమేనని చంద్రబాబు అన్నారు. కిడారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పారు. అభివృద్ధి కోసం పాటుపడే వారిని చంపేస్తే గిరిజన గ్రామాలు ఎలా బాగుపడతాయన్నారు.
కిడారి గిరిజనులకు ఎంతో సేవ చేశారన్నారు. సర్వేశ్వర రావు మంచి నాయకత్వం ఉన్న నేత అన్నారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అనంతరం ఆయన మాజీ ఎమ్మెల్యే శివేరు సోమ కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.
అరకు ఘటనపై ప్రభుత్వం సీరియస్
అరకు ఘటనపై ప్రభుత్వం సీరియస్గా ఉంది. కీలక అధికారులపై వేటు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లాస్థాయి అధికారులపై బదలీ వేటు పడే అవకాశముంది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!











Click it and Unblock the Notifications