కొత్త ఇంటికి భూమి పూజ చేసిన చంద్రబాబు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త ఇంటి నిర్మాణం హైదరాబాదులో ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ ఇల్లు జూబ్లీహిల్స్లోని రోడ్డు నంబర్ 65లో ఉంది. గత నెలలో ఈ ఇంటి నిర్మాణం కోసం జూబ్లీహిల్స్ 24వ రోడ్డు నంబర్లో అద్దె ఇంటికి చంద్రబాబు మారారు.
ఆదివారం ఉదయం నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు కుటుంబ సభ్యులు భూమి పూజ చేశారు. నారా లోకేష్ అమెరికా పర్యటనలో ఉన్నందు వల్ల ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు.
ఏడాదిన్నర కాలంలో ఈ ఇంటి నిర్మాణం పూర్తవుతుందని ప్రభుత్వవర్గాలు తెలిపాయి. జూబ్లీహిల్స్లోని రోడ్ నెంబర్ 65లో ఉన్న ఇఁటి స్థానంలో కొత్త భవనం నిర్మించాలని గతంలోనే చంద్రాబబు నిర్ణయం తీసుకున్నారు.
ఆ కొత్త భవనం నిర్మాణం పూర్తయ్యే వరకు చంద్రబాబు కుటుంబ సభ్యులు జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 24లో గల అద్దె ఇంట్లో ఉంటారు.
chandrababu naidu telugudesam andhra pradesh hyderabad చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్
English summary
Andhra Pradesh CM and Telugudesam party president Nara Chandrababu Naidu performed Bhoomi puja for his new house in Hyderabad.
Story first published: Monday, May 11, 2015, 9:52 [IST]