టీడీపీలోకి వచ్చే వైసీపీ నేతలపై చంద్రబాబు షాకింగ్ నిర్ణయం!!
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చేందుకు కొందరు నేతలు ఎదురుచూస్తున్నారని వస్తున్న వార్తల నేపథ్యంలో తాజాగా పార్టీ నాయకులతో ఉండవల్లిలో సమావేశమైన క్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు తనకు టచ్లో చాలామంది వచ్చారని, అయితే వారి గ్రాఫ్, ప్రజలలో వారికున్న సానుభూతి వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు.
ఎంతోమంది తనతో టచ్ లోకి వచ్చారని, అయితే అందరికీ తాను స్వాగతం పలకలేనని, తెలుగుదేశం పార్టీలోకి రావాలనుకున్న వారు ఎందుకు వస్తున్నారో .. వారు ఏం చేయాలని భావిస్తున్నారో తెలుసుకొని తదనుగుణంగా నిర్ణయం తీసుకుంటామన్నారు. చాలామంది టికెట్లు ఆశించి వస్తున్నారని, వచ్చిన వారందరికీ టికెట్లు ఇచ్చుకుంటూ పోలేమని చంద్రబాబు పేర్కొన్నారు.

ఇప్పటికే పొత్తుల కారణంగా టిడిపిలో చాలామంది కీలక నాయకులకు టిక్కెట్లు ఇవ్వకుండా పక్కన పెట్టాల్సి వచ్చిందని చంద్రబాబు తన నివాసంలో భేటీ అయిన క్రమంలో పేర్కొన్నారు. ఇక రానున్న ఎన్నికలను ఉద్దేశించి పార్టీ సీనియర్ నాయకులకు దిశా నిర్దేశం చేసిన చంద్రబాబు వచ్చే ఎన్నికలకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలని, తన ప్లాన్ ను వివరించారు.
ఎన్నికలకు 56 రోజులు మాత్రమే గడువు ఉందని, ఇప్పటివరకు ఎవరు ఏం చేశారు? ఎలా ఉన్నారు? అన్నదాన్ని తను ప్రశ్నించదలుచుకో లేదని, కానీ ఈ 56 రోజులు మాత్రం పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలని పార్టీ నాయకులకు చంద్రబాబు సూచించారు. ఇప్పటికే తాను రా కదలిరా సభలతో ప్రజలలోకి వెళ్లానని పేర్కొన్న చంద్రబాబు, ప్రస్తుతం శంఖారావం కొనసాగుతుంది అంటూ వ్యాఖ్యలు చేశారు.

భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ఇప్పటికే టిడిపిలో పొత్తుల వల్ల, కొత్తగా జరిగిన చేరికల వల్ల చాలామంది ఎప్పటి నుండో కష్టపడిన నేతలకు టికెట్లు రాలేదని పేర్కొన్న చంద్రబాబు వారికి భవిష్యత్తులో నష్టం జరగకుండా చూడటానికే ప్రాధాన్యత ఇస్తానని, ప్రస్తుతం ఎన్నికల సమయంలో ప్రతి ఒక్కరు కలిసికట్టుగా పనిచేసి విజయం సాధించే దిశగా పార్టీని ముందుకు నడిపించాలి అన్నారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి మేలు చేసేలా నిర్ణయాలు ఉంటాయని, పార్టీ కోసం పని చేసే వారిని విస్మరించేది లేదని చంద్రబాబు పేర్కొన్నారు. ఇక ఈ విషయాన్ని క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులు అందరికి దృష్టికి తీసుకురావాలని చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు.
-
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications