విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేసీఆర్‌కే మెచ్యూరిటీ ఉందా? నాకు లేదా?: మోడీపై చంద్రబాబు నిప్పులు

|
Google Oneindia TeluguNews

Recommended Video

కేసీఆర్‌కే మెచ్యూరిటీ ఉందా? నాకు లేదా? : చంద్రబాబు నాయుడు

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేంద్రం వివక్ష పూరితంగా వ్యవహరిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. శనివారం ఢిల్లీలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో వెనుకబడిన జిల్లాలకు నిధులు మంజూరు చేసిన కేంద్రం ఏపీలో వెనుకబడిన జిల్లాలకు నిధులిచ్చి వెనక్కు తీసుకుందని మండిపడ్డారు.

<strong>ఏపీపై కుట్రలు, భయభ్రాంతులకు గురిచేస్తున్నారు: ఢిల్లీలో కేంద్రంపై చంద్రబాబు ఫైర్</strong>ఏపీపై కుట్రలు, భయభ్రాంతులకు గురిచేస్తున్నారు: ఢిల్లీలో కేంద్రంపై చంద్రబాబు ఫైర్

తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యలు సృష్టిస్తారా?

తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యలు సృష్టిస్తారా?

తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలను సమావేశ పరిచి రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు పరిష్కరించాల్సి ఉండగా.. ప్రధానియే సమస్యలు సృష్టిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.

<strong>జగన్‌పై దాడి జరిగితే.. మమ్మల్ని ఏ1, ఏ2లంటారా?: చంద్రబాబు ఆగ్రహం, ‘తక్కువ అంచనావేయొద్దు'</strong>జగన్‌పై దాడి జరిగితే.. మమ్మల్ని ఏ1, ఏ2లంటారా?: చంద్రబాబు ఆగ్రహం, ‘తక్కువ అంచనావేయొద్దు'

రూపాయి అందలేదు

రూపాయి అందలేదు

ఏపీకి ఎలాంటి సాయం చేయలేదని, రూపాయి కూడా ఇవ్వలేదని కేంద్రంపై మండిపడ్డారు చంద్రబాబు. విద్యాసంస్థలను కూడా ఏర్పాటు చేయలేదని, విశాఖపట్నం, విజయవాడలో మెట్రో రైల్వేను ఏర్పాటు చేయలేదన్నారు. విభజన చట్టంలోని హామీలను పక్కనపెట్టారని కేంద్రంపై మండిపడ్డారు.

తెలంగాణ సీఎంకే మెచ్యూరిటీ ఉందా? నాకు లేదా?

తెలంగాణ సీఎంకే మెచ్యూరిటీ ఉందా? నాకు లేదా?

తెలంగాణ సీఎంకే మెచ్యూరిటీ ఉందని ప్రధాని వ్యాఖ్యానించడం ఏంటని ప్రశ్నించారు. తెలంగాణ సీఎంకే మెచ్యూరిటీ ఉందా? నాకు లేదా? అని ప్రధాని నరేంద్ర మోడీని ప్రశ్నించారు చంద్రబాబు. ఉమ్మడి ఏపీలో తాను ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చానని, హైదరాబాద్, సైబరాబాద్‌లో ఐటీ అభివృద్ధి చేశానని తెలిపారు.

ఏపీని ఆదుకోరా?

ఏపీని ఆదుకోరా?

కేరళలో వరదలతో తీవ్ర నష్టం వస్తే కేంద్రం ఆదుకోలేదని, ఏపీలో కూడా హుధుద్, ఇటీవల టిట్లీ తుఫానుతో నష్టం జరిగినా కేంద్రం ఎలాంటి సాయం అందించలేదని చంద్రబాబు ఆరోపించారు. కేంద్రమంత్రి రాజ్‌నాథ్ రాష్ట్రానికి వచ్చినా బీజేపీ కార్యాలయాన్ని ఓపెన్ చేస్తారు కానీ, తుఫాను ప్రభావిత ప్రాంతాలను పరిశీలించరా? అని చంద్రబాబు ప్రశ్నించారు.

English summary
Andhra Pradesh CM Chandrababu Naidu on Saturday slams at PM Narendra Modi in delhi media meet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X