వనజాక్షికి చంద్రబాబు ఫోన్: మాట్లాడ్తానని హామీ, కల్పన ఫైర్
విజయవాడ: తెలుగుదేశం పార్టీ శానససభ్యుడు చింతమనేని ప్రభాకర్, ఆయన అనుచరులు దాడి చేశారని ఆరోపిస్తున్న కృష్మా జిల్లా ముసునూరు ఎమ్మార్వో వనజాక్షితో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫోన్లో మాట్లాడారు. ఢిల్లీ నుంచి ఆయన ఆమెకు ఫోన్ చేసి దాడి ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.
కృష్ణా జిల్లా ముసునూరు తహశీల్దార్ వనజాక్షిపై దాడి దురదృష్టకరమని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తహశీల్దార్ వనజాక్షితో ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు ఘటనపై పూర్తి వివరాలు తెప్పించుకుంటానన్నారు. తాను ఢిల్లీలో ఉన్నా, రాగానే అన్ని విషయాలు మాట్లాడుతానని తహశీల్దార్కు చెప్పారు. ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలిస్తానన్నారు. ఉద్యోగుల భద్రతకు తాను హామీ ఇస్తున్నానని వనజాక్షితో చంద్రబాబు చెప్పారు.
వివాదాన్ని పరిష్కరించాల్సిన బాధ్యతను చంద్రబాబు మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావుకు, విజయవాడ టిడిపి నాయకుడు వల్లభనేని వంశీకి అప్పగించారు. అయితే, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు ఉప్పులేటి కల్పన ఘటనపై తీవ్రంగా స్పందించారు.

వనజాక్షిపై దాడి కేసును నీరు గార్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,, మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు ఒత్తిడి చేస్తున్నారని ఆమె ఆరోపించారు. చింతమనేని ప్రభాకర్ను కాపాడేందుకు ప్రభుత్వం వనజాక్షిపై తప్పుడు కేసులు పెట్టేందుకు సిద్ధమైందని ఆమె శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆరోపింాచరు .
వనజాక్షిపై దాడికి నిరసనగా రెవెన్యూ ఉద్యోగులు ధర్నాకు దిగారు. వారి ధర్నాకు వైయస్సార్ కాంగ్రెసు, సిపిఐ, సిపిఎం నాయకులు మద్దతు ప్రకటించారు. రెవెన్యూ ఉద్యోగులు కార్యాలయాలకు తాళాలు వేసి ధర్నాకు దిగారు. రెవెన్యూ ఉద్యోగులతో మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు చర్చలను ప్రారంభిచారు. చింతమనేని ప్రభాకర్ను, ఆయన గన్మన్ను అరెస్టు చేయాల్సిందేనని రెవెన్యూ ఉద్యోగులు పట్టుబడుతున్నారు.
-
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications