వనజాక్షికి చంద్రబాబు ఫోన్: మాట్లాడ్తానని హామీ, కల్పన ఫైర్
విజయవాడ: తెలుగుదేశం పార్టీ శానససభ్యుడు చింతమనేని ప్రభాకర్, ఆయన అనుచరులు దాడి చేశారని ఆరోపిస్తున్న కృష్మా జిల్లా ముసునూరు ఎమ్మార్వో వనజాక్షితో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫోన్లో మాట్లాడారు. ఢిల్లీ నుంచి ఆయన ఆమెకు ఫోన్ చేసి దాడి ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.
కృష్ణా జిల్లా ముసునూరు తహశీల్దార్ వనజాక్షిపై దాడి దురదృష్టకరమని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తహశీల్దార్ వనజాక్షితో ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు ఘటనపై పూర్తి వివరాలు తెప్పించుకుంటానన్నారు. తాను ఢిల్లీలో ఉన్నా, రాగానే అన్ని విషయాలు మాట్లాడుతానని తహశీల్దార్కు చెప్పారు. ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలిస్తానన్నారు. ఉద్యోగుల భద్రతకు తాను హామీ ఇస్తున్నానని వనజాక్షితో చంద్రబాబు చెప్పారు.
వివాదాన్ని పరిష్కరించాల్సిన బాధ్యతను చంద్రబాబు మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావుకు, విజయవాడ టిడిపి నాయకుడు వల్లభనేని వంశీకి అప్పగించారు. అయితే, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు ఉప్పులేటి కల్పన ఘటనపై తీవ్రంగా స్పందించారు.

వనజాక్షిపై దాడి కేసును నీరు గార్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,, మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు ఒత్తిడి చేస్తున్నారని ఆమె ఆరోపించారు. చింతమనేని ప్రభాకర్ను కాపాడేందుకు ప్రభుత్వం వనజాక్షిపై తప్పుడు కేసులు పెట్టేందుకు సిద్ధమైందని ఆమె శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆరోపింాచరు .
వనజాక్షిపై దాడికి నిరసనగా రెవెన్యూ ఉద్యోగులు ధర్నాకు దిగారు. వారి ధర్నాకు వైయస్సార్ కాంగ్రెసు, సిపిఐ, సిపిఎం నాయకులు మద్దతు ప్రకటించారు. రెవెన్యూ ఉద్యోగులు కార్యాలయాలకు తాళాలు వేసి ధర్నాకు దిగారు. రెవెన్యూ ఉద్యోగులతో మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు చర్చలను ప్రారంభిచారు. చింతమనేని ప్రభాకర్ను, ఆయన గన్మన్ను అరెస్టు చేయాల్సిందేనని రెవెన్యూ ఉద్యోగులు పట్టుబడుతున్నారు.
-
కర్ణాటకలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన నారా లోకేష్..! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం!












Click it and Unblock the Notifications