దురదృష్ట ఘటన, ఆదుకుంటా: బాబు, వెంట కేంద్రమంత్రి
రాజమండ్రి: గ్యాస్ పైప్ లైన్ ప్రమాదం దురదృష్టకరమైన ఘటన అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం అన్నారు. తూర్పు గోదావరి జిల్లాలోని మామిడికుదురు మండలం నగరం గ్రామంలో చంద్రబాబు మృతులు, క్షతగాత్రుల కుటుంబాలను పరామర్శించారు.
ఈ సందర్భంగా మాట్లాడారు. మృతుల కుటుంబాలను, క్షతగాత్రులను అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పారు. ఘటన పైన పూర్తిస్థాయి విచారణకు ఆదేశించామన్నారు. నిర్లక్ష్యం వహించిన వారి పైన చర్యలు తీసుకుంటామని, ఈ ఘటన బాధాకరమన్నారు. చంద్రబాబుతో పాటు కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్, ఓఎన్జీసీ, గెయిల్ అధికారులు కూడా ఉన్నారు.

ప్రమాదానికి కారకులపై చర్యలు: తోట
గ్యాస్ పైప్లైన్ పేలుడుకు కారకులైన వారిపై చర్యలు తీసుకుంటామని మంత్రి తోట నర్సింహం తెలిపారు. శుక్రవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ నాణ్యతలేని పైపుల వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోందన్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
ఉన్నతస్థాయి విచారణ చేపట్టాలి : నారాయణ
నగరం గ్యాస్ ప్రమాద ఘటనపై ఉన్నతస్థాయి విచారణ చేపట్టాలని సీపీఐ నేత నారాయణ డిమాండ్ చేశారు. ప్రమాదం వెనక రిలయన్స్, ఇతర శక్తుల హస్తం ఉండవచ్చు అని ఆయన ఆరోపించారు. మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల ఎక్స్గ్రేషియాల ఇవ్వాలని నారాయణ డిమాండ్ చేశారు.
-
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!! -
మందు బాబుల పై ధరల బాంబు- మద్యం రేట్లు భారీగా పెంపు, వీటికి మినహాయింపు..!! -
LKG, UKG ఇక సర్కారు బడిలోనే.. 6 వేల కొత్త ఉద్యోగాల! -
CSK vs RCB: ఓటమికి కారణమెవరంటే ? నిజాయితీగా చెప్పేసిన రుతురాజ్..! -
ఆ ఉద్యోగులను రెండు నెలల్లో పర్మినెంట్ చెయ్యండి.. హైకోర్టు కీలక ఆదేశాలు! -
పొంచి ఉన్న తుఫాన్ ముప్పు, భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
నరసాపురం To అరుణాచలం, బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్..! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరే వేళ ఊహించని ట్విస్ట్..!! -
షాకిచ్చిన నటాషా.. హార్దిక్ లైఫ్లో ఊహించని ట్విస్ట్! -
గంటన్నారలో అమరావతి టు హైదరాబాద్, కేంద్రం కీలక నిర్ణయం..!! -
ఏమిటీ వింత? తెల్ల పులికి పుట్టిన పసుపు పిల్లలు.. -
36 రోజులపాటు ఇంటర్నెట్ బంద్.. సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications