జగన్ను అలా కొడుతున్న చంద్రబాబు: పులివెందులపై పక్కా వ్యూహాలు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న పులివెందులలోను వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలవాలని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు .
Recommended Video
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న పులివెందులలోను వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలవాలని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు.
రెడ్లు జగన్ వెంటే, భార్యాభర్తలు ఇంట్లో ఉన్నా: జేసీ ఆసక్తికరం, పవన్, రకుల్ ప్రీత్లు వస్తే అంతే
పులివెందుల టార్గెట్
ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి పులివెందుల పార్టీ నాయకులు బాగా శ్రమించాలని చంద్రబాబు సూచించారు. ఆయన పులివెందుల నియోజకవర్గంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులకు గెలుపును లక్ష్యంగా పెట్టారు.
సమీక్షలో జిల్లా నేతలు
సమీక్షలో మంత్రి ఆదినారాయణ రెడ్డి, జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, పులివెందుల ఇంచార్జ్ సతీష్ రెడ్డి, శాసన మండలి సభ్యులు బీటెక్ రవి తదితరులు పాల్గొన్నారు. పులివెందుల గెలుపు కోసం అందరు కలిసి శ్రమించాలని సూచించారు. గెలుపు కోసం పక్కా వ్యూహాలతో ముందుకు వెళ్లాలని సూచించారు.
కుప్పంతో సమానంగా పులివెందుల
కుప్పం నియోజకవర్గంతో సమానంగా తాను పులివెందులను చూసుకుంటానని, అవసరమైన నిధులు ఇస్తానని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని, అలాగే దానిని ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని సూచించారు. పార్టీ కోసం పని చేయకుండా నిధులు అడిగితే లాభం లేదన్నారు. తద్వారా భారీ నిధులు ఇవ్వడం ద్వారా జగన్ను టార్గెట్ చేయాలని బాబు చూస్తున్నట్లుగా కనిపిస్తోంది.
పులివెందుల రైతులు ఏం అడిగినా ఇద్దాం
పులివెందుల రైతులు కూడా ఆర్థికంగా అభివృద్ధి కావాలని పట్టుదలతో నీళ్లు ఇస్తున్నామని, వారికి మనం చేయూతను ఇద్దామని, ఏం కావాలన్నా చేద్దామని, వారికి మీరు నాయకత్వం వహిస్తే చాలు అని చంద్రబాబు సూచించారు. కాగా, బహిరంగ సభకు కూడా ప్లాన్ చేస్తున్నారు.