పందికోసం ఉచ్చు పెడితే చిరుత పులి పడింది-ఉలిక్కిపడ్డ గన్నవరం..!
ఏపీలో ఈ మధ్య పులుల సంచారం పెరుగుతుందన్న వార్తల నేపథ్యంలో కృష్ణాజిల్లా గన్నవరంలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఓ రైతు తన పొలంలో పందుల కోసం పన్నని ఉచ్చులో ఏకంగా చిరుత పులి వచ్చి పడింది. అర్ధరాత్రి పొలంలోకి వచ్చిన చిరుత పులి ఈ ఉచ్చులో చిక్కుకుని చనిపోయింది. గన్నవరం రూరల్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనతో జిల్లాలో జనం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గంలో ఈ ఉదయం చిరుత పులి చనిపోయిందన్న వార్త దావానంలా వ్యాపించింది. గన్నవరం మండలం మెట్లపల్లి లో చిరుతపులుల సంచారంపై ఎప్పటి నుంచో ప్రచారం ఉంది. అయితే గ్రామానికి చెందిన రైతు తన పంట పొలం రక్షించేందుకు పందులకు ఉచ్చు పెట్టగా అందులో చిరుత పులి చిక్కింది. రైతు ఉదయాన్నే పొలం వెళ్లి చూడగా ఉచ్చులో చిక్కి మృతి చెందినట్లు కనిపించింది. దీంతో రైతు ఆందోళనతో పొరుగున ఉన్న వారికి విషయం చెప్పాడు.

మెట్లపల్లిలో చిరుత రైతు పెట్టిన ఉచ్చులో చిక్కుకుని చనిపోయిందన్న వార్తతో గ్రామస్తులు, పరిసర ప్రాంత ప్రజలు ఒక్కసారిగా అవాక్కయ్యారు. అక్కడికి చేరుకుని చిరుతను కదిలించేందుకు ప్రయత్నించారు. కానీ అది కదలకపోవడంతో చనిపోయిందని నిర్దారించుకుని అధికారులకు సమాచారం అందించారు. మెట్లపల్లి చుట్టుపక్కల అటవీ ప్రాంతంలో ఇంకా చిరుతపులులు ఉన్నాయేమో అన్న ఆందోళనలో చుట్టుపక్కల ప్రజలు ఉన్నారు. అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగి పులుల సంచారంపై ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications