విజయసాయిని అడ్డుపెట్టుకొని జగన్ లాబీయింగ్, పవన్ కళ్యాణ్ అలాగే: చినరాజప్ప
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎంపీ విజయ సాయి రెడ్డిని అడ్డు పెట్టుకొని లాబీయింగ్ చేస్తున్నారని హోమంత్రి చినరాజప్ప మంగళవారం విమర్శించారు. విజయసాయి ఢిల్లీలో లాబీయింగ్ చేస్తున్నారని చెప్పారు. ఏ2 నిందితుడు చంద్రబాబును విమర్శించడమా అన్నారు.
కాపు రిజర్వేషన్లపై తాము చిత్తశుద్ధితో ఉన్నామని చెప్పారు. లోటు బడ్జెట్ను కేంద్రం పూర్తి చేయడం లేదన్నారు. ప్రత్యేక హోదాలాగే కాపుల విషయంలోను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారని చెప్పారు. ముద్రగడకు ఏ పని లేదు కాబట్టి లేఖలు రాస్తున్నారని చెప్పారు.

అంతకుముందు, వైసీపీ ఎంపీ వరప్రసాద్ ఢిల్లీలో మాట్లాడుతూ.. టీడీపీ ఎంపీలు రాజీనామాల విషయంలో తమతో కలిసి వస్తే ఒత్తిడి పెరుగుతుందన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలని కేంద్రం చూస్తోందన్నారు. ఏ రోజు సభ నిరవధిక వాయిదా పడుతుందో తెలియదన్నారు. టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేయాలన్నారు. ఏపీ ప్రజలు హోదాను బలంగా కోరుకుంటున్నారని చెప్పారు.












Click it and Unblock the Notifications