ఏపీ అసెంబ్లీ స్పీకర్.. యునానిమస్: వైసీపీ లేకుండా
Chintakayala Ayyannapatrudu: ఊహించినట్టే- ఏపీ అసెంబ్లీ స్పీకర్గా తెలుగుదేశం పార్టీకి చెందిన శాసన సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు ఎన్నికయ్యారు. ఆయన ఎన్నిక ఏకగ్రీవం అయింది. స్పీకర్ అయ్యన్నపాత్రుడు మినహా మరెవరూ నామినేషన్ పత్రాలను దాఖలు చేయలేదు.
అసెంబ్లీ స్పీకర్గా చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రకటించారు. ఆ వెంటనే సభ్యులందరూ చప్పట్లు కొడుతూ, బల్లలు చరుస్తూ హర్షధ్వానాలను తెలియజేశారు. ఆయన వద్దకు వెళ్లి అభినందనలు తెలియజేశారు.

అనంతరం తెలుగుదేశం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్రశాఖ మాజీ అధ్యక్షుడు, వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, జనసేన నుంచి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, భారతీయ జనతా పార్టీ తరఫున వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్.. అయ్యన్నపాత్రుడును సగౌరవంగా స్పీకర్ స్థానం వరకు తీసుకెళ్లారు. ఆయనకు అభినందనలు తెలిపారు.
అసెంబ్లీలో అత్యంత సీనియర్ సభ్యుల్లో అయ్యన్నపాత్రుడు ఒకరు. గతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో వివిధ శాఖలకు మంత్రిగా పని చేశారు. మొన్నటి ఎన్నికల్లో అనకాపల్లి జిల్లాలోని నర్సీపట్నం నుంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. తన సమీప ప్రత్యర్థి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పెట్ల ఉమాశంకర్ గణేష్ను 24 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడించారు.
1983, 1985, 1994, 1999, 2004, 2019, 2024 నర్సీపట్నం నుంచి అయ్యన్నపాత్రుడు ఏడు సార్లు గెలిచారు. ఆయనకు ఉన్న అపార రాజకీయ, సభా అనుభవాలను దృష్టిలో ఉంచుకుని టీడీపీ- జనసేన- బీజేపీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం అయ్యన్నపాత్రుడిని స్పీకర్గా నామినేట్ చేసింది.
కాగా- స్పీకర్ ఎన్నిక సమయంలో సభలో వైఎస్ఆర్సీపీ సభ్యులు లేరు. నేటి సభా కార్యకలాపాలను వారు బహిష్కరించారు. తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న పార్టీ కేంద్ర కార్యాలయాన్ని కూల్చివేసిన ఘటనకు నిరసనగా వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో విధ్వంసక పాలన ఆరంభమైందంటూ మండిపడ్డారు.
-
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం-ఎల్పీజీ సిలెండర్ల స్ధానంలో ఇక..! -
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
స్టీల్ ప్లాంట్ కి కాదు స్టీల్ సిటీకి పునాది.. ప్రపంచస్థాయి నగరంగా విశాఖ: చంద్రబాబు! -
షర్మిల ఆరోపణలపై జగన్ మౌనం వెనుక, అసలు విషయం బయట పెట్టిన కొడాలి నాని..!! -
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications