నామినేటెడ్ పదవులపై చంద్రబాబు కసరత్తు - దక్కేదెవరికి..!!
ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం..పార్టీ పరంగానూ వేగంగా అడుగులు వేస్తున్నారు. పాలనా పరంగా కీలక శాఖల్లో అధికారుల బదిలీ పైన కసరత్తు చేస్తున్నారు. తన కార్యాలయ టీంను ఇప్పటికే సిద్దం చేసుకున్నారు. పార్టీ పరంగానూ నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా నామినేటెడ్ పదవుల భర్తీ పైన ఫోకస్ చేసారు. ఎవరికి పదవులు దక్కేదీ చంద్రబాబు స్పష్టత ఇచ్చారు.
చంద్రబాబు నిర్ణయాలు
ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉండాలని నిర్ణయించారు. ప్రతీ రోజు సచివాలయంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉండనున్నారు. ప్రతీ సోమవారం గతంలో తరహాలోనే పోలవరం పైన సమీక్షలు..పోలవరం సందర్శనకు నిర్ణయించారు. అదే విధంగా మంత్రులు సైతం సచివాలయంకు రావాలని..జిల్లాల పర్యటనలతో పార్టీ కార్యాలయంలో కేడర్ కు అందుబాటులో ఉండాలని సూచించారు. చంద్రబాబు ప్రతీ వారాంతం పార్టీ కార్యాలయంకు రావాలని నిర్ణయించారు.

పార్టీ కార్యాలయంలోనూ
తాజాగా చంద్రబాబు పార్టీ నేతలతో టెలికాన్ఫిరెన్స్ నిర్వహించారు. అధికారం వచ్చిందని కక్షసాధింపులకు పాల్పడవద్దని వారికి సూచించారు. చట్టప్రకారం జరిగేది జరుగుతుందని చెప్తూ.. ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఎలాంటి పనులు చేయొద్దని హితవు పలికారు. అలాగే కార్యకర్తలను ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించొద్దని చెప్పుకొచ్చారు. బాధ్యత, చిత్తశుద్ధితో పనిచేయాలని ఆదేశించారు. అదే సమయంలో పార్టీ నేతలకు గుడ్న్యూస్ కూడా చెప్పారు చంద్రబాబు. త్వరలోనే నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.
చంద్రబాబు కసరత్తు
పలువురు సీనియర్లకు మంత్రివర్గంలో అవకాశం దక్కలేదు. దీంతో, నామినేటెడ్ పదవుల ద్వారా సీనియర్లకు పదవులు ఇవ్వటంతో పాటుగా కింది స్థాయి నుంచి పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి కచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పారు. మూడు పార్టీల కూటమి అధికారంలోకి రావటంతో మిత్రపక్షాలైన జనసేన..బీజేపీ నేతలకు పదవులు కేటాయించాల్సి ఉంది. సీట్లు దక్కని నియోజకవర్గ నేతలకు ఇచ్చిన హామీల్లో భాగంగా ప్రాధాన్యత కల్పించాల్సి ఉంటుంది. దీంతో..రాష్ట్ర స్థాయి..జిల్లా స్థాయి నామినేటెడ్ పదవుల్లో చంద్రబాబు ఎంపిక ఎలా ఉంటుందనే ఉత్కంఠ పార్టీ వర్గాల్లో మొదలైంది.
-
ఇక ఒక్క మిస్డ్ కాల్తో గ్యాస్ బుకింగ్: కొత్త నంబర్లు ఇవే! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..!












Click it and Unblock the Notifications