చంద్రబాబు నేతృత్వంలో...టిడిపి వ్యూహ కమిటీ భేటీ:ఉత్కంఠ
అమరావతి: సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ వ్యూహ కమిటీ మరోసారి భేటీ అయింది. ఈ సమావేశంలో మంత్రులు యనమల రామకృష్ణుడు, కళావెంకట్రావు, సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, కాలవ శ్రీనివాసులు, లోకేశ్, అచ్చెన్నాయుడు తదితరులు పాల్గొన్నట్లు తెలుస్తోంది.
తాజా రాజకీయ పరిణామాలు, రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. ఢిల్లీలో రాజకీయ పరిణామాలతో పాటు ఎపిలో పరిస్థితులు, ఎంపీల ఆందోళన నేపథ్యంలో కేంద్రం స్పందించకుంటే అనుసరించాల్సిన వ్యూహం పై కూడా చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అలాగే ఈ నెల 11 ఆదివారం తెదేపా పోలిట్బ్యూరో సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో తాజా రాజకీయ అంశాలపై కీలక చర్చలతో పాటు పార్టీ రాజ్యసభ అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నట్లు తెలిసింది.
ఇదిలావుండగా టిడిపి రాజ్యసభ స్థానాలు ఈసారి ఎవరికి దక్కుతాయోననే విషయమై ఆ పార్టీతో పాటు అందరిలోను ఉత్కంఠ నెలకొంది. శని, ఆదివారాలు సెలవులు కావడం, నామినేషన్ దాఖలుకు సోమవారామే చివరి రోజు కావడంతో ఎవరికి అవకాశం లభిస్తుందోనని ఆశావహులు కళ్లల్లో ఒత్తులు వేసుకొని పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు. ఆదివారం జరిగే పొలిట్బ్యూరో సమావేశంలో అభ్యర్థులను ఎంపిక చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
-
డోర్నకల్–గద్వాల్ కొత్త రైల్వే లైన్ తో పాటు రైల్వే ప్రాజెక్ట్ లపై కేంద్రం శుభవార్త! -
మార్కాపురం బస్సు ప్రమాదం..సీఎం చంద్రబాబు,లోకేష్ తో పాటు మంత్రుల దిగ్భ్రాంతి -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్












Click it and Unblock the Notifications